close
Choose your channels

క్లాస్ రూమ్‌లో మైనర్ విద్యార్థుల పెళ్లి.. లైక్స్ కోసమేనట...

Thursday, December 3, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ విద్యార్థుల పెళ్లి కలకలం సృష్టించింది. క్లాస్ రూమ్‎లోనే పెళ్లి చేసుకున్న వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. క్లాస్ రూమ్‌లోనే స్నేహితుని సమక్షంలో.. ఓ విద్యార్థి.. తోటి విద్యార్థినికి పసుపుతాడు కట్టి, నుదిటిపై బొట్టు పెట్టాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మైనర్ల వివాహం నవంబర్ 17న జరిగినట్లు వీడియోలను బట్టి తెలుస్తోంది. పెళ్లి తాలుకు ఫోటోలు, వీడియోలు కాలేజీ ప్రిన్సిపాల్ వరకు వెళ్లాయి. విషయం తెలుసుకున్న కాలేజీ ప్రిన్సిపాల్ ఇద్దరు విద్యార్థులకు గట్టి వార్నింగ్‎ ఇవ్వడమే కాకుండా వివాహం చేసుకున్న విద్యార్థులతో పాటు సాయంగా నిలిచిన విద్యార్థికి సైతం టీసీ ఇచ్చి పంపించేశారు.

సరదా కోసమే వివాహం చేసుకున్నారు..

మైనర్ విద్యార్థుల పెళ్లిపై కళాశాల ప్రిన్సిపాల్ మేరీ సుజాత స్పందించారు. విద్యార్థులపై చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కేవలం వాళ్లు సరదా కోసమే ప్రేమ వివాహం చేసుకున్నట్లు విచారణలో తెలిందని పేర్కొన్నారు. అయినా ఇలాంటి పనులు కాలేజీలో చేయడం తప్పని భావించి ఇద్దరు విద్యార్థులకు గట్టి వార్నింగ్‎ ఇచ్చి, వారికి సహాయం చేసిన మరో విద్యార్థికి కూడా టీసీ ఇచ్చి కాలేజీ నుంచి ముగ్గురిని పంపిచామని మేరీ సుజాత వెల్లడించారు. కాగా.. నవంబర్ 27న విద్యార్థుల తల్లిదండ్రులు పెళ్లి వీడియోను తమ దృష్టికి తెచ్చారన్నారు.

ఈ విషయమై విచారణ నిర్వహించగా.. నవంబర్ 17వ తేదీ ఉదయం 8-30 గంటలకు ముగ్గురు విద్యార్థులు కాలేజీకి వచ్చి ఈ విధంగా చేస్తే లైక్‌లు ఎన్ని వస్తాయో.. లేదో చూద్దామని సరదాగా ఫ్రాంక్ వీడియో తీసుకున్నామని, తర్వాత భయం వేసి వెంటనే వీడియోను తొలగించామని విద్యార్థులు రాతపూర్వకంగా వెల్లడించారని ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రుల దృష్టికి సైతం తీసుకెళ్లామని అయినా వారు వినిపించుకోవడం లేదని మేరీ సుజాత వెల్లడించారు. సరదాగా చేసిన పనే తప్ప.. చెడు ఆలోచన లేదని విద్యర్థులు తనకు చెప్పారన్నారు. కాలేజీ తెరిచే సమయానికి గంట ముందే వచ్చి ఫ్రాంక్ వీడియో తీయడం తప్పని భావిస్తూ.. వారికి టీసీ ఇచ్చి పంపిచామని ప్రిన్సిపల్ మేరీ సుజాత వెల్లడించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.