దాసరి కొడుకు ప్రభు అచూకి లభ్యం...

  • IndiaGlitz, [Wednesday,June 19 2019]

ఆరు రోజుల క్రితం మిస్సయిన దాసరి నారాయణరావు పెద్ద కుమారుడు దాసరి ప్రభు ఆచూకీ లభ్యమైంది. గురువారం రోజు ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ప్రభు బుధవారం మధ్యాహ్నం నాలుగు గంటల ప్రాంతంలో హైదరాబాద్‌లోని తన ఇంటికి చేరుకున్నారు. కాగా.. గతవారం దాసరి ప్రభు అదృశ్యమైనట్టు ఆయన కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఇంటికి చేరుకున్న విషయం తెలుసుకున్న పోలీసులు.. అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకు ఇళ్లు వదలి వెళ్లిపోయారు..? ఇంట్లో ఏమైనా గొడవలు జరిగాయా..? ఆరు రోజులుగా ఎక్కడున్నారు..? ఇలా పలు కోణాల్లో పోలీసులు ప్రభుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు సమాచారం.

కాగా.. మొదట ప్రభు.. చిత్తూరు జిల్లాకు వెళ్లినట్టు గుర్తించిన పోలీసులు అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. త్వరలోనే చిత్తూరు జిల్లా పోలీసులతో మాట్లాడి హైదరాబాద్‌కు రప్పిస్తామని దాసరి కుటుంబ సభ్యులకు అభయం చెప్పి బుధవారం సాయంత్రం హైదరాబాద్‌కు రప్పించారు. కాగా.. దాసరి ప్రభుకు రెండు పెళ్లిళ్లు అయ్యాయి. మొదటి భార్య సుశీలతో ప్రభుకు గతం నుంచే అనేక వివాదాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన అటు ఇటు తిరుగుతున్నారని సమాచారం. పోలీసుల తాజా విచారణలో ఈ వ్యవహారాలన్నింటికీ ఫుల్‌స్టాప్ అవకాశాలు మెండుగా ఉన్నాయి.

More News

సీమ రెడ్లంతా టీడీపీకి టాటా చెప్పబోతున్నారా.. వాట్ నెక్ట్స్‌!?

రాయలసీమలోని టీడీపీకి చెందిన రెడ్లంతా పార్టీకి టాటా చెప్పేసేందుకు సిద్ధమవుతున్నారా..? అన్నీ అనుకున్నట్లు జరిగితే అటు బీజేపీలోకి కొందరు..

'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' ప్రీ రిలీజ్‌

న‌వీన్ పొలిశెట్టి, శృతి శ‌ర్మ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ‌’.

సందీప్ కిషన్ కోసం నటులుగా మారిన దర్శకులు

సందీప్ కిషన్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం 'నిను వీడని నీడను నేనే'. కార్తీక్ రాజు దర్శకుడు. ఏకే ఎంట్టైన్మెంట్స్ పతాకంపై

'ప్రేమ‌జంట‌' ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌

సన్ వుడ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రామ్ ప్రణీత్, సుమయ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం `ప్రేమ‌జంట‌`.

నాగ‌శౌర్య ని ప‌రామ‌ర్శించిన ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్రరావు

ఐరా క్రియేష‌న్స్ ప‌తాకం పై ఉషా మూల్పూరి నిర్మాత‌గా, శంక‌ర్ ప్ర‌సాద్ మూల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో