నారా లోకేష్‌‌ను ప్రమాదం నుంచి కాపాడిన ఎమ్మెల్యే..

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ప్రస్తుతం నారా లోకేష్ పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్నారు. కాగా.. నేడు ఆయన ఆకివీడు మండలం సిద్ధాపురం వద్ద ట్రాక్టర్ నడిపారు. ఈ క్రమంలో ట్రాక్టర్ అదుపుతప్పి సమీపంలో ఉన్న ఉప్పటేరు కాల్వలోకి దూసుకెళ్లింది. పక్కనే ఉన్న ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే మంతెన రామరాజు అప్రమత్తమై ట్రాక్టర్‌ను అదుపు చేశారు. దీంతో లోకేష్ క్షేమంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. అనంతరం లోకేష్‌ను ట్రాక్టర్‌ నుంచి దింపేశారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఆయన వెంట ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఊపిరిపీల్చుకుంది.

కాగా ఘటనకు ముందు నారా లోకేష్.. ఆకివీడు ఆకివీడు మండలం సిద్ధాపురం వద్ద వరదల వలన పాడైన చేపలను లోకేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దీనికి ముందు మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలపై మండిపడ్డారు. వైసీపీ దొంగలు తనను తిరగనీయకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వైసీపీ నేతలు పర్యటిస్తే తాము తిరిగేవాళ్లం కామని ఆయన స్పష్టం చేశారు. కొల్లేరుకు ఎన్నడూ లేని రీతిలో వరదలు వచ్చాయని.. కానీ ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది లేదని నారా లోకేష్ విమర్శించారు.

తెలుగు రాష్ట్రాల్లో గత పదిరోజులుగా భారీ వర్షాలకు ఏపీలోని లోతట్టు ప్రాంతాలన్నీ ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. మరోవైపు పంటపొలాలు నీట మునిగి రైతన్నలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలు, పంటలు మునిగిన రైతన్నలను పరామర్శించాలని నారా లోకేష్ సంకల్పించారు. ఇందులో భాగంగా ఇప్పటికే తూర్పుగోదావరి, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో పర్యటించి రైతులను పరామర్శించారు.

More News

'సర్కారువారి పాట' షురూ అయ్యేదప్పుడేనా..!

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ హీరోగా ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోతున్న చిత్రం ‘స‌ర్కారు వారి పాట‌’.

మ్యూజిక్ డైరెక్టర్ కోటి చేతుల మీదుగా ‘కళాపోషకులు’ చిత్రం నుండి నువ్వేలే నువ్వేలే సాంగ్ విడుదల!

విశ్వకార్తికేయ, దీప ఉమావతి హీరోహీరోయిన్లుగా శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై  చలపతి పువ్వల ద‌ర్శ‌క‌త్వంలో ఏమ్. సుధాకర్ రెడ్డి నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం ‘కళాపోషకులు’.

దసరా పండగ సందర్భంగా పూజా కార్యక్రమాలతొ ప్రారంభమైన`వాళ్ళిద్ద‌రు`!

ర‌మేష్ ఆర్యన్, అర్జున్ మహి(`ఇష్టంగా` ఫేమ్‌), డాలి చావ్లా, మీన‌ల్ మీన‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతోన్న చిత్రం `వాళ్ళిద్ద‌రు`.

బేబీ లాలిత్య సమర్పణలో శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ లో కొత్త చిత్రం ప్రారంభం!

బేబీ లాలిత్య సమర్పణలో శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి.ఎమ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న నూతన చిత్రం దసరా సందర్భంగా

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉన్న 'ఏమైపోయావే'

శ్రీరామ్ క్రియేషన్స్, వీఎం  స్టూడియోస్ పతాకాలపై మురళి దర్శకత్వంలో రాజీవ్ సిద్ధార్థ్, భవాని చౌదరి, శాను మజ్జారి హీరోహీరోయిన్లుగా