అక్బరుద్దీన్ పైకిపోతేనే బెటర్.. ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

  • IndiaGlitz, [Saturday,August 24 2019]

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రులు చుట్టూ తిరుగుతున్నారు. అయితే గ్యాప్ వచ్చి ఎక్కడైనా సభలు, సమావేశాలు పెడితే మాత్రం బీజేపీ, హిందువులపై ఇష్టానుసారం నోటికొచ్చినట్లు మాట్లాడేస్తారన్న విషయం విదితమే. అంతేకాదు.. తాను ఎన్ని రోజులు బతుకుతానో తనకే తెలియదని.. ఉన్నన్నిరోజులు మాత్రం బీజేపీ భరతం పడతానన్నట్లుగా ఓ సభలో వ్యాఖ్యానించారు. అప్పట్లో ఈయన మాటలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపాయి. ఆ తర్వాత కేసులు, కేంద్రానికి ఫిర్యాదులు ఇవన్నీ అయిపోయాయి.

అయితే తాజాగా అక్బరుద్దీన్ గురించి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అక్బరుద్దీన్ కోలుకోవాలని మీరు అనుకుంటున్నారా..? అని ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురవ్వగా సింగిల్ పదంతో సమాధానమిచ్చేశారు. ‘అలాంటి వ్యక్తులు పైకిపోతేనే బెటర్’ అంటూ హాట్ కామెంట్ చేయడం గమనార్హం.

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరన్న విషయం విదితమే. ఇప్పుడున్న రాజకీయ నేతలు ఇవాళ తిట్టుకున్న రేపొద్దున్న ఒక్కటై బాయి బాయి అంటుంటారు. కానీ ఇటు బీజేపీ.. అటు మజ్లిస్ నేతలు మాత్రం నిత్యం కత్తులు దూసుకుంటూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా హిందుత్వ అనే ఎజెండాతోనే.. హిందుత్వనే నమ్ముకున్న రాజాసింగ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అయితే రాజా వ్యాఖ్యలపై ఓవైసీ బ్రదర్స్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

More News

‘రైతు’ కానున్న ‘రణరంగం’ హీరో!

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ విభిన్న పాత్రల్లో చేస్తుంటారన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా లవ్ స్టోరీ రిలేటెడ్ కథల్లో ఎక్కువగా నటిస్తుంటారు.

జగన్ చెప్పలేదుగా అమరావతిపై ఆందోళన వద్దు!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని తరలిస్తారని గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో కోడై కూస్తున్న సంగతి తెలిసిందే.

ఒకే ఏడాదిలో ఐదుగురి ఉద్దండులను కోల్పోయిన బీజేపీ

బీజేపీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. 2019 ఏడాదిలోనే ఎంతో మంది ఉద్ధండులను బీజేపీ కోల్పోవడం గమనార్హం.

పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన శివ కంఠమనేని ఫ్యామిలీ సస్పెన్స్‌ థ్రిల్లర్‌

శివ కంఠమనేని కథానాయకుడిగా లైట్‌ హౌస్‌ సినీ మేజిక్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం. 2గా రూపొందుతోన్న నూతన సినిమా హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో శనివారం పూజా కార్యక్రమాలతో

రాజధాని నిర్మాణం అమరావతిలోనే జరగాలి: పవన్

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం అమరావతిలోనే జరగాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.