close
Choose your channels

అక్బరుద్దీన్ పైకిపోతేనే బెటర్.. ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

Saturday, August 24, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అక్బరుద్దీన్ పైకిపోతేనే బెటర్.. ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రులు చుట్టూ తిరుగుతున్నారు. అయితే గ్యాప్ వచ్చి ఎక్కడైనా సభలు, సమావేశాలు పెడితే మాత్రం బీజేపీ, హిందువులపై ఇష్టానుసారం నోటికొచ్చినట్లు మాట్లాడేస్తారన్న విషయం విదితమే. అంతేకాదు.. తాను ఎన్ని రోజులు బతుకుతానో తనకే తెలియదని.. ఉన్నన్నిరోజులు మాత్రం బీజేపీ భరతం పడతానన్నట్లుగా ఓ సభలో వ్యాఖ్యానించారు. అప్పట్లో ఈయన మాటలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపాయి. ఆ తర్వాత కేసులు, కేంద్రానికి ఫిర్యాదులు ఇవన్నీ అయిపోయాయి.

అయితే తాజాగా అక్బరుద్దీన్ గురించి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అక్బరుద్దీన్ కోలుకోవాలని మీరు అనుకుంటున్నారా..? అని ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురవ్వగా సింగిల్ పదంతో సమాధానమిచ్చేశారు. ‘అలాంటి వ్యక్తులు పైకిపోతేనే బెటర్’ అంటూ హాట్ కామెంట్ చేయడం గమనార్హం.

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరన్న విషయం విదితమే. ఇప్పుడున్న రాజకీయ నేతలు ఇవాళ తిట్టుకున్న రేపొద్దున్న ఒక్కటై బాయి బాయి అంటుంటారు. కానీ ఇటు బీజేపీ.. అటు మజ్లిస్ నేతలు మాత్రం నిత్యం కత్తులు దూసుకుంటూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా హిందుత్వ అనే ఎజెండాతోనే.. హిందుత్వనే నమ్ముకున్న రాజాసింగ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అయితే రాజా వ్యాఖ్యలపై ఓవైసీ బ్రదర్స్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.