వైజాగ్ స్టేడియంలో ఆధునీకరణ పనులకు శ్రీకారం


Send us your feedback to audioarticles@vaarta.com


వైజాగ్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఆదివారం స్టేడియం పునరుద్ధరణ, ఆధునీకరణ పనులను పురస్కరించుకుని శిలాఫలకం ఆవిష్కరణ జరిగింది. ఈ శిలాఫలాకాన్ని ఐసీసీ ఛైర్మన్ జైషా, బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, ఏసీఏ అధ్యక్షుడు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) తో కలిసి మంత్రి లోకేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా ఏసీఏ అధ్యక్షుడు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని), మంత్రి నారా లోకేష్ ను శాలువాతో సత్కరించి శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రతిమను బహుకరించారు. అలాగే ఐసీసీ ఛైర్మన్ జైషా, బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ లను కూడా ఏసీఏ అధ్యక్షుడు చిన్ని సత్కరించారు.
శిలాఫలకం ఆవిష్కరించిన తర్వాత.. అంతా కలిసి స్టేడియంలో జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వెర్సెస్ సన్ రైజర్స్ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ను వీక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ క్రికెటర్ చాముండేశ్వరినాథ్, బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, ఏసీఏ సెక్రటరీ సానా సతీష్, తదితరులు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments