‘గేమ్‌ చేంజర్‌’ కోసం ట్రంప్ ఫోన్.. మోదీ ఊహించని షాక్

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై అగ్రరాజ్యం అమెరికా కూడా పోరాటం చేస్తోంది. ఇప్పటికే సుమారు 9500 పై చిలుకు మరణాలు సంభవించాయి. 336,907 మంది కరోనాతో బాధపడుతున్నారు. కరోనా ప్రభావం ఎక్కువ అమెరికాపైనే ఉంది. ఈ క్రమంలో దీనిపై పోరాటం చేసేందుకు గాను ఎన్నోరోజులుగా వ్యాక్సిన్ కనుగొనేందుకు అమెరికాలో ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో.. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌‌కు మరికొన్ని మందులు కలిపి వాడగా మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. ప్రస్తుతం హైడ్రాక్సి క్లోరోక్విన్ ‘గేమ్‌ చేంజర్‌’ గా మారిపోయింది. వాస్తవానికి దీన్ని మలేరియా నివారణకు మన ఇండియాలో ఎక్కువగా వాడేవారు. ఇది మన భారతదేశంలో పెద్దఎత్తునే ఉంది. ఈ నేపథ్యంలో భారత్ నుంచి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవాలని అమెరికా సన్నాహాలు చేస్తోంది.

అసలేం జరిగింది..!?

ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి.. ‘మీ దగ్గర పెద్దఎత్తున ఉత్పత్తి అవుతున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను మేం దిగుమతి చేసుకుంటాం ఇవ్వండి’ అని కోరగా ట్రంప్‌కు గట్టి ఝలక్ ఇచ్చారు. ఇవ్వడానికి వీలుకాదని చెప్పేశారట. ఫోన్ చేసిన చేసిన రోజే ఏ మాత్రం ఆలోచించకుండానే మోదీ ఈ మాట చెప్పేశారు. అయితే.. అంతకుమందే ఒకరితో ఒకరు మంచిగానే మాట్లాడుకున్నారు కూడా. నిజంగా భారత్ నుంచి ఇలాంటి రియాక్షన్ ఉంటుందని బహుశా ట్రంప్ ఊహించి ఉండడేమో. అమెరికాతో మంచిగా ఉంటూనే మోదీ ఇలా ఊహించని షాకివ్వడం గమనార్హం అని పలువురు నిపుణులు చెబుతున్నారు.

ఇందుకే షాకిచ్చింది..!

ప్రస్తుతం మనదేశంలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతున్నాయ్. దీంతో మనకు కూడా హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ అవసరం చాలానే ఉంది. ఈ క్రమంలో ఇస్తానని మాట చెప్పి.. ఇవ్వకుండా ఎగ్గొట్టడం సబబు కాదని.. ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పేశారన్న మాట. వాస్తవానికి కరోనా రోగులకు న్యూయార్క్‌లో హైడ్రాక్సీ క్లోరోక్విన్‌తో ఇతర మందులు కలిపి వాడగా మెరుగైన ఫలితాలు లభించడంతో ఇండియా నుంచి దిగుమతి చేసుకోవచ్చని ట్రంప్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే.. ఒకే ఒక్క మాటతో ట్రంప్ ఆశలన్నీ మోదీ ఆవిరిచేసేశారు. కాగా.. ఇండియాలో ఐదువేలకు చేరువలో కరోనా కేసులు ఉండగా.. 328 మంది కోలుకుంటున్నారు. ఇప్పటి వరకూ 118 మంది మరణించారు. అయితే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ వల్ల కరోనా రోగులు కోలుకుంటున్నారు.

‘గేమ్ చేంజర్‌’ అనుకుంటే..

కాగా.. కరోనాపై పోరాటంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ట్రంప్‌ ‘గేమ్‌ చేంజర్‌’గా పలుమార్లు అభివర్ణించిన విషయం తెలిసిందే. అంతేకాదు.. ప్రస్తుతం మన శాస్త్రవేత్తలు చేస్తున్న ట్రయల్స్‌ వర్కవుట్ అయితే ‘స్వర్గం నుంచి అందిన బహుమతి’గా భావిస్తానని కూడా చెప్పారు. ఇప్పటికే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ వినియోగానికి 29 మిలియన్‌ డోస్‌లను నిల్వ చేసి పెట్టుకున్న అమెరికా.. మరింత సేకరించాలని ఇండియాను సంప్రదించగా.. మోదీ ఊహించని షాకిచ్చారు. అంతేకాదు.. అమెరికాలాగే మున్ముంథు ఇంకా ఎన్ని అగ్రదేశాలు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌‌ను అడుగుతాయో.. మోదీ మళ్లీ ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో..!

More News

అమెరికాలో పులికి కరోనా.. భారత్‌లో హై అలెర్ట్

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మనుషులనే కాదు.. జంతువులనూ వదలట్లేదు. ప్రపంచంలో ఫస్ట్ టైమ్ ఈ మహమ్మారి నాలుగేళ్ల పులికి సోకింది.

ద‌ర్శక నిర్మాత త‌మ్మారెడ్డికి మాతృ వియోగం

టాలీవుడ్ ప్రముఖ ద‌ర్శక నిర్మాత తమ్మారెడ్డి భ‌ర‌ద్వాజ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. తమ్మారెడ్డి మాతృమూర్తి కృష్ణవేణి (94) సోమ‌వారం కన్నుమూశారు.

రాజీవ్ కనకాల ఇంట విషాదం.. కేన్సర్‌తో సోదరి కన్నుమూత

టాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు రాజీవ్ కనకాల ఇంట మరో విషాదం నెలకొంది. రాజీవ్ సోదరి, ప్రముఖ టీవీ నటి శ్రీలక్ష్మి గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు.

పీఎం సహాయ నిధికి కృష్ణంరాజు ఫ్యామిలీ విరాళం

ప్రపంచమంతా కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ సమాజంలోని అన్ని వర్గాల వారు స్పందించాల్సిన అవసరం ఉందని సుప్రసిద్ధ నటులు, నిర్మాత, మాజీ కేంద్ర మంత్రి రెబల్ స్టార్ కృష్ణంరాజు పేర్కొన్నారు.

9 pm 9 మినిట్స్‌... వ‌ర్మ స్టైలే వేరు

ప్ర‌స్తుతం దేశం క్లిష్ట‌ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటుంది. క‌రోనా వైర‌స్‌ను పార‌ద్రోల‌డానికి దేశం యావ‌త్తు శ‌క్తి వంచ‌న లేకుండా పోరాడుతుంది. సామాజిక దూరాన్ని