close
Choose your channels

ఢిల్లీలో విజయసాయిరెడ్డికి ఊహించని ఘటన!

Thursday, June 20, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఢిల్లీలో విజయసాయిరెడ్డికి ఊహించని ఘటన!

ఢిల్లీ వేదికగా బుధవారం నాడు అఖిలపక్ష సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ భేటీ అనంతరం పార్లమెంట్ లైబ్రరీ భవనంలో ఓ ఆసక్తికర, ఊహించని సన్నివేశం జరిగింది. సమావేశం ముగిశాక కేంద్రమంత్రులతో కలిసి ప్రధాని మోదీ బయటికి వస్తుండగా.. ఆ సమయంలో వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కనిపించడంతో ఒక్కసారిగా ఆగిన మోదీ ఆగారు. విజయసాయిరెడ్డిని చూసిన మోదీ.. ‘హాయ్..విజయ్ గారు’ అంటూ ప్రత్యేకంగా పలకరించి మరీ షేక్ హ్యాండ్ ఇచ్చారు.

ప్రధాని మోదీ చేయిచాచి పిలవగానే.. విజయసాయిరెడ్డి కూడా వెళ్లి కరచాలనం చేసి నమస్కరించారు. అనంతరం మోదీ తనటీమ్‌తో అక్కడ్నుంచి వెళ్లిపోయారు. మోదీ వచ్చిన రూట్‌లోనే ఏపీ సీఎం వైఎస్ జగన్ అండ్ టీమ్ వచ్చింది. కాగా విజయసాయితో పాటు ఆయన వెంట వైసీపీ ఎంపీ నందిగాం సురేష్, వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు. ఈ ఆసక్తికర విషయాన్ని ఎంతో ఎక్సైటింగ్‌తో విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు. అంతేకాదు ఇందుకు సంబంధించిన వీడియోను సైతం ఈ ట్వీట్‌కు జతచేశారు.

విజయసాయి మాటల్లోనే...

"ఈరోజు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం అనంతరం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బయటకు వెళుతూ లాబీలో శ్రీ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి కోసం నిరీక్షిస్తున్న నన్ను చూసి 'హాయ్ విజయ్‌ గారు' అని పలకరిస్తూ నావైపుకు అడుగులు వేసి నాతో కరచాలనం చేశారు. ఊహించని ఈ ఘటన నా జీవితంలో ఒక మధుర జ్ఞాపకం" అని విజయసాయిరెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు పలువురు నెటిజన్లు వావ్.. అని కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం కాస్త వెరైటీగా విమర్శలు గుప్పిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.