ఎస్వీ రంగారావుగా మోహన్ బాబు

  • IndiaGlitz, [Saturday,September 16 2017]

మ‌హాన‌టి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం మ‌హాన‌టి. టైటిల్ రోల్‌లో కీర్తి సురేష్ న‌టిస్తుండ‌గా.. ముఖ్య పాత్ర‌ల్లో స‌మంత‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, దుల్క‌ర్ స‌ల్మాన్‌, ప్ర‌కాష్ రాజ్‌, షాలిని పాండే త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం ఫేమ్ నాగ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతి మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మ‌హాన‌టుడు ఎస్వీ రంగారావు పాత్ర‌ని మోహ‌న్ బాబు చేస్తున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

అక్టోబ‌ర్ చివ‌ర‌లోగానీ న‌వంబ‌ర్‌లో గానీ మోహ‌న్‌బాబుపై ఉండే స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. సినిమాలో ఈ పాత్ర కొద్దిసేపే ఉంటుంద‌ని స‌మాచారం. ఎస్వీఆర్‌ పాత్ర‌కి మోహ‌న్‌బాబు న్యాయం చేస్తార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తానికి ఆర్టిస్ట్‌ల ఎంపిక‌లో మంచి మార్కులే పొందుతోంది మ‌హాన‌టి చిత్రం. ఇంకా ఈ లిస్ట్‌లో ఎవ‌రెవ‌రి పేర్లు చేరుతాయో చూడాలి. 2018లో మ‌హాన‌టి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

More News

రాశి.. మూడేళ్ల త‌రువాత‌

2014లో విడుద‌లైన త‌న తొలి తెలుగు చిత్రం ఊహ‌లు గుస‌గుస‌లాడే తో మంచి న‌టిగా పేరు తెచ్చుకున్న రాశి ఖ‌న్నా.. త‌న రెండో తెలుగు చిత్రం జోరుతో మంచి గాయ‌నిగానూ పేరు తెచ్చుకుంది.

ఆ ద‌ర్శ‌కుడికి అదో స‌ర‌దా

ప‌టాస్ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన అనిల్ రావిపూడి.. రెండో చిత్రాన్ని సుప్రీమ్‌గా తెర‌కెక్కించి మ‌రో హిట్‌ని త‌న ఖాతాలో వేసుకున్నాడు.

ఇప్పుడు ప్ర‌భుదేవా వంతు..

సీనియ‌ర్ హీరోల‌తో పాటు, క‌థ‌, క‌థ‌నం బావుంటే యంగ్ హీరోలు కూడా నెగ‌టివ్ షేడ్ ఉన్న క్యారెక్ట‌ర్స్ చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. వివ‌రాల్లోకెళ్తే..కొరియోగ్రాఫర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ప్ర‌భుదేవా త‌ర్వాత డ్యాన్స్ మాస్ట‌ర్‌గా, న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌గా మారారు.

మోహ‌న్‌బాబుతో ఐటెమ్ భామ‌లు...

విల‌క్ష‌ణ న‌టుడిగా, నిర్మాత‌గా రాణించిన మోహ‌న్‌బాబు చాలా గ్యాప్ త‌ర్వాత పూర్తి స్థాయి చిత్రంలో న‌టిస్తున్న చిత్రం 'గాయ‌త్రి'. ఇందులో మోహ‌న్‌బాబు త‌న‌యుడు, హీరో విష్ణు కూడా కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. మోహ‌న్‌బాబు త‌న‌య‌గా నిఖిలా విమ‌ల్ న‌టిస్తుంది.

ఈ ద‌స‌రాకి 'స్పైడ‌ర్‌'తో పెద్ద హిట్ కొడుతున్నాం - సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌

సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్‌లో ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం 'స్పెడర్‌'.