పవన్ తో విభేదించిన కలెక్షన్ కింగ్..

  • IndiaGlitz, [Wednesday,May 10 2017]

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం టిటిడి దేవాల‌య ఈవోగా ఐఎఎస్ సింఘాల్‌ను నియ‌మించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఉత్త‌రాదికి చెందిన ఐఎఎస్‌ను టిటిడి ఈవోగా నియ‌మించ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు ఎదుర‌వుతున్నాయి. స్వామి స‌ర‌స్వ‌తి దయానంద ఉత్త‌రాది ఈవో సింఘాల్‌పై విమ‌ర్శ‌లు చేశారు. ఈ విష‌యంపై కోర్టుకు కూడా వెళ‌తామ‌ని స్వామిజీ తెలియ‌జేశారు. అదే రోజున జ‌న‌సేన అధినేత, పవ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కూడా సింఘాల్‌పై విమ‌ర్శ‌లు చేశారు. ఉత్త‌రాది వారికి ద‌క్షిణాది సంస్కృతి గురించి తెలియ‌ద‌ని, ఉత్త‌రాది గుళ్ళ‌కు ద‌క్షిణాది వారిని ఈవోలుగా నియ‌మిస్తారా..
అలాంట‌ప్పుడు సింఘాల్‌ను టిటిడి ఈవోగా ఎలా నియ‌మించారు, దీనిపై చంద్ర‌బాబునాయుడు స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నాడు. అయితే ఐఎఎస్‌లు దేశంలో ఎక్క‌డైనా ప‌నిచేయాల్సి ఉంటుంద‌ని, అలాంట‌ప్పుడు సింఘాల్ నియామ‌కంలో త‌ప్పేంట‌ని రాజేంద్ర‌బాబు అనే టిడిపి నాయ‌కుడు ప‌వ‌న్‌ను విమ‌ర్శించాడు. ఇదే విష‌యంపై మోహ‌న్‌బాబు మాట్లాడుతూ హిందువులంద‌రికీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి దేవుడ‌ని, ఆయ‌న్ను ఒక ప్రాంతానికి ప‌రిమితం చేయ‌డం స‌రికాద‌ని, ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌ను తాను ఖండిస్తున్న‌ట్లు తెలిపారు. మ‌రి దీనిపై ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఎలాంటి వివ‌ర‌ణ ఇస్తారో చూడాలి.

More News

'వైశాఖం' థియేట్రికల్ ట్రైలర్ విడుదల

'ప్రేమలో పావని కళ్యాణ్', 'చంటిగాడు', 'గుండమ్మగారి మనవడు', 'లవ్లీ' వంటి సూపర్హిట్ చిత్రాల తర్వాత డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ బి. దర్శకత్వంలో బి.ఎ. రాజు నిర్మిస్తున్న లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం 'వైశాఖం'. ఆర్.జె. సినిమాస్ పతాకంపై హరీష్, అవంతిక జంటగా నటించిన ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ను బుధవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో విడుదల చేశా

5 లక్షల విలువైన హెల్త్ కార్డు లను అందజేసిన ప్రతాని

చిన్న చిత్రాల నిర్మాతలకు అండగా నిలిచి , కార్మికుల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ధీరోదాత్తుడు ప్రతాని రామకృష్ణా గౌడ్ తాజాగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో 24 క్రాఫ్ట్స్ లో ఉన్న సాంకేతిక నిపుణులకు , నటీనటులకు ప్రభుత్వ సహాయంతో 5 లక్షల విలువైన హెల్త్ కార్డు ని అందించాడు . ఈ హెల్త్ కార్డు వల్ల ఆరోగ్య భద్రత మాత్రమే కాకుండా ఇ&

బాలకృష్ణ హీరోగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కళ్యాణ్ ప్రతిష్ఠాత్మక భారీ చిత్రం

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా సి.కె.ఎంటర్ టైన్ మెంట్స్ ప్రై.లిమిటెడ్ పతాకంపై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో

సీక్వెల్ ఆలోచనలో రాజమౌళి..

ఐదేళ్ళ పాటు బాహుబలితో బిజీగా మారిపోయిన ఎస్.ఎస్.రాజమౌళి,

బ్రూస్ లీ గురించి నాకే బాగా తెలుసంటున్న వర్మ...

వివాదస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కన్ను ఇప్పుడు బ్రూస్ లీపై పడింది.