'మహానటి' కోసం పారితోషికం తీసుకోని మోహ‌న్‌బాబు

  • IndiaGlitz, [Monday,April 09 2018]

సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం 'మహానటి'. అలనాటి మేటి నటి సావిత్రి జీవిత కథను వెండి తెరపై ఆవిష్కరించ‌నున్న బ‌యోపిక్ ఇది. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించ‌గా.. మిగిలిన కీలకపాత్రల్లో సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మోహన్ బాబు నటించారు. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో నటించిన మోహన్ బాబుకు సంబంధించిన విషయమొకటి వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో లెజెండరీ యాక్టర్ ఎస్.వి.రంగారావు పాత్రలో మోహన్ బాబు నటించారు. ఆ పాత్రలో నటించేందుకు మోహన్ బాబు ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదట. తన కోసం అయ్యే ఖర్చులను కూడా తానే భరించారట.

మోహన్ బాబు అడిగితే కోటి రూపాయల వరకు ఇవ్వడానికి సిద్దపడ్డారట నిర్మాత అశ్వనీదత్. కాని ఎస్.వి.రంగారావు పాత్రలో నటించడమే ఒక గౌరవం. అది వెలకట్టలేని పాత్ర అంటూ ఎస్‌.వి.ఆర్‌.పై త‌నకున్న ప్రేమని, గౌరవాన్ని చాటుకున్నారు క‌ళాప్ర‌పూర్ణ‌. త్వరలో మోహన్ బాబు పాత్రకు సంబంధించి ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనుంది చిత్ర బృందం.

More News

'బిగ్ బాస్' లో మళ్లీ ఎన్టీఆర్‌

తొలిసారిగా 'మా టీవి' నిర్వహించిన 'బిగ్ బాస్' రియాల్టీ షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాద‌యాత్ర ప్రారంభించిన రొజు యాత్ర షూటింగ్ ప్రారంభం

సినిమాని వ్యాపారంగా కాకుండా ఫ్యాష‌న్ గా చిత్రాలు నిర్మించే నిర్మాణ సంస్థ‌లు తెలుగు ఇండ‌స్ట్రిలో చాలా త‌క్కువుగా వున్నాయి.

అర్జున్, జేడీ చక్రవర్తి కాంబినేషన్ లో 'కాంట్రాక్ట్'

యాక్షన్ కింగ్ అర్జున్ చాలా రోజుల విరామం తర్వాత హీరోగా నటిస్తున్న తెలుగు చిత్రం కాంట్రాక్ట్. ఇందులో హీరో జేడీ చక్రవర్తి చాలా రోజుల తర్వాత విలన్‌గా నటిస్తుండటం విశేషం.

'పంతం' రిలీజ్ డేట్ మారింది

'ఆంధ్రుడు', 'య‌జ్ఞం', 'ల‌క్ష్యం', 'శౌర్యం', 'లౌక్యం' వంటి సూప‌ర్‌డూప‌ర్ చిత్రాలతో మెప్పించిన టాలీవుడ్ ఎగ్రెసివ్ హీరో గోపీచంద్

త్రివిక్ర‌మ్‌.. ఎన్టీఆర్ సినిమాతో ట్రాక్ ఎక్కుతారా?

త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు చెబితే.. తూటాల్లా పేలే డైలాగులు, మనసును హత్తుకునే మాటలు, హాయిగా నవ్వుకునే పంచ్‌లు గుర్తుకొస్తాయి.