జూనియ‌ర్ కుప్ప‌న్న ఫ్యామిలీ రెస్టారెంట్ ను ప్రారంభించిన మోహ‌న్ బాబు

  • IndiaGlitz, [Wednesday,July 06 2016]

న‌టి, నిర్మాత‌, టెలివిజ‌న్ వ్యాఖ్యాత‌గా పేరొందిన మంచుల‌క్ష్మి అన్ని రంగాల్లోనూ త‌న‌దైన శైలిలో గుర్తింపు తెచ్చుకుంది. ఎప్పుడు చూసినా ల‌క్ష్మి నే క‌నిపిస్తుంది, త‌న భ‌ర్త ఎక్కువ‌గా ఎక్క‌డా క‌నిపించ‌డు అనుకునే వాళ్ల కోస‌మో ఏమో... సాఫ్ట్ వేర్ గా స్థిర‌ప‌డిన ల‌క్ష్మి భ‌ర్త ఆనంద్ ఇప్పుడు హోటల్ రంగంలో అడుగుపెట్టి, అంద‌రి కంటా ప‌డుతున్నారు. జూనియ‌ర్ కుప్ప‌న్న‌ పేరుతో ఒక ఫ్యామిలీ రెస్టారెంట్ ను ప్రారంభించారు. ఈ ఫ్రాంచైజ్ లో మొద‌టి రెస్టారెంట్ ను హైద‌రాబాద్ లోని హైటెక్ సిటీలో మంచు మోహ‌న్ బాబు ఈరోజు ఉద‌యం ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా మోహ‌న్ బాబు మాట్లాడుతూ.. ఎప్ప‌టినుంచో ఫైవ్ స్టార్ హోట‌ల్ పెట్టాల‌న్న నా కోరికను మా తండ్రి కి చెప్ప‌గా, ఆయ‌న హోట‌ల్ ఎందుకు న‌లుగురికి ఉప‌యోగ‌ప‌డే విధంగా ఏదైనా స్కూల్ క‌ట్టించు అన్నారు. ఆ నేప‌థ్యంలోనే నేను శ్రీ విద్యానికేత‌న్ ను మొద‌లుపెట్టి నా తండ్రి కోరికను నెర‌వేర్చాను. కానీ నా కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది. ఇప్పుడు నా కోరిక‌ను మా అమ్మాయి ల‌క్ష్మీ ప్ర‌స‌న్న‌, అల్లుడు ఆనంద్ నెర‌వేరుస్తున్నందుకు సంతోషంగా ఉంది. జూనియ‌ర్ కుప్ప‌న్నఫ్రాంచైజీని ఎంచుకోవ‌డం ఎంతో ఆనందంగా ఉంది. ఇక్క‌డ దొరికే ప్ర‌తి వంట‌కం, ఎటువంటి కెమిక‌ల్స్ లేకుండా, ఒకసారి తింటే నెల‌జీతం మొత్తం ఈ రెస్టారెంట్ కే అంకితమిచ్చేలా ఉంటుంద‌న్నారు.

మంచు ల‌క్ష్మి మాట్లాడుతూ.. ఈ రెస్టారెంట్ ను హైద‌రాబాద్ లో మొద‌టిగా తామే ప‌రిచ‌యం చేయ‌డం ఎంతో సంతోషంగా ఉంది. చెన్నై, బెంగుళూరు ల‌లో జూనియ‌ర్ కుప్ప‌న్న రెస్టారెంట్ గురించి తెలియ‌ని వారుండ‌రు.నేను బెంగుళూరు వెళ్తే కుప్ప‌న్నకు వెళ్ల‌కుండా, వ‌చ్చేదే ఉండ‌దు. మెడిటేష‌న్ మైండ్ కు, కుప్ప‌న్న క‌డుపు కు అనే ఫార్ములాను అక్క‌డున్న‌ప్పుడు నేను త‌ప్ప‌కుండా ఆచ‌రించే ఫార్ములా. మా అదృష్టం కొద్దీ కుప్ప‌న్న ఓన‌ర్ నాకు మంచి ఫ్రెండ్ కావ‌డంతో, మాకు ఈ ఫ్రాంఛైజ్ దొరికింది. ప్ర‌తి ఒక్క‌రికి ఇంటి రుచిని మ‌రిపించే విధంగా ఈ రెస్టారెంట్ ను హైద‌రాబాదీయుల‌కు అందుబాటులోకి తీసుకురావ‌డం ఎంతో సంతోషంగా ఉంది అన్నారు.ఈ కార్య‌క్ర‌మంలో మోహ‌న్ బాబుతో స‌హా, మంచు వార‌సులు కుటుంబ స‌మేతంగా పాల్గొన్నారు.

More News

ఐదేళ్ల తర్వాత న్యూ బిగినింగ్ అంటున్న నాయిక...

ఐదేళ్ల తర్వాత న్యూ బిగినింగ్ అంటున్న నాయిక ఎవరో కాదు అందాల నాయిక అంజలి.షాపింగ్ మాల్,జర్నీ,సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు,గీతాంజలి,డిక్టేటర్...

A సర్టిఫికేట్ తో 300 దియోటర్స్ లో రష్మి గౌతమ్ సినిమా రేపే విడుదల

'గుంటూరు టాకీస్'లాంటి సూపర్డూపర్ హిట్ చిత్రంతో యువత హ్రుదయాల్లో పర్మినెంట్ ప్లేస్ ని సొంతం చేసుకున్న రష్మిగౌతమ్ హీరోయిన్ గా ప్రదానపాత్రలో నటించిన చిత్రం 'అంతం'.

బన్ని, హరీష్ శంకర్ ఇద్దరికీ ఆమే కావాలట...

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సరైనోడు బ్లాక్ బష్టర్ తర్వాత హరీష్ శంకర్ తో మూవీ చేయనున్నారు.ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.

కార్తీ కాష్మోరా ఎంత వరకు వచ్చింది....

కార్తీ నటిస్తున్న తాజా చిత్రం కాష్మోరా.హర్రర్ కధాంశంతో రూపొందుతున్న కాష్మోరా చిత్రాన్ని గోకుల్ తెరకెక్కిస్తున్నారు.

ఆ హీరోయిన్ తో వ‌ర్క్ చేయాల‌నుకుంటున్న ద‌ర్శ‌కేంద్రుడు..

ఏ హీరోయిన్ అయినా ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు సినిమాలో న‌టించాలి అనుకుంటుంది. అయితే...దీనికి భిన్నంగా రాఘ‌వేంద్ర‌రావే ఓ హీరోయిన్ తో వ‌ర్క్ చేయాల‌నుకుంటున్నార‌ట‌.