ధనరాజ్ అండ్ కో నటిస్తున్న 'బంతిపూల జానకి' టైటిల్ లోగో ఆవిష్కరించిన మోహన్ లాల్

  • IndiaGlitz, [Saturday,January 16 2016]

ధన్ రాజ్, దీక్షా పంత్, మౌనిక, షకలక శంకర్, చమక్ చంద్ర, సుడిగాలి సుదీర్, రాకెట్ రాఘవ, అదుర్స్ రఘు, అప్పారావు, రచ్చ రవి ముఖ్య పాత్రల్లో రూపొందుతున్న చిత్రం "బంతిపూల జానకి". ఉజ్వల క్రియేషన్స్ పతాకంపై నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్సకత్వంలో శ్రీమతి కళ్యాణి రామ్ నిర్మిస్తున్నారు. అతి త్వరలో సెట్స్ కు వెళ్లి, సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ పూర్తి చేసుకోనున్న ఈ చిత్రం టైటిల్ లోగోను మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఆవిష్కరించి, ధన రాజ్ బృందాన్ని అభినందించారు.

ఈ సందర్భంగా ధనరాజ్ మాట్లాడుతూ.. "ఒక సరికొత్త జోనర్ లో రూపొందనున్న చిత్రమిది. మేం అడిగిన వెంటనే.. మా చిత్రం లోగోను ఆవిష్కరించిన సూపర్ స్టార్ మోహన్ లాల్ గారికి "బంతిపూల జానకి" బృందం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను" అన్నారు.

ఈ చిత్రానికి పబ్లిసిటీ డిజైనర్: వివా, కెమెరా: జి.ఎల్.బాబు, ఎడిటింగ్: శివ.వై.ప్రసాద్, పాటలు: కాసర్ల శ్యామ్, మ్యూజిక్: బోలె, కథ-మాటలు: శేఖర్ విఖ్యాత్, నిర్మాత: శ్రీమతి కళ్యాణి రామ్, స్క్రీన్ ప్లే-దర్సకత్వం: నెల్లుట్ల ప్రవీణ్ చందర్!!

More News

'కళ్యాణ వైభోగమే' సెన్సార్ పూర్తి...

శ్రీ రంజిత్ మూవీస్ పతాకం పై కె. ఎల్.దామోదర్ ప్రసాద్ 'అలా మొదలైంది 'అంతకు ముందు ఆ తరువాత ' లాంటి కుటుంబ కధా చిత్రాల తరువాత బి.వి నందిని రెడ్డి దర్శకత్వం లో నిర్మించిన చిత్రం 'కళ్యాణ వైభోగమే'.

కేరళకు బాహుబలి టీమ్..

దర్శక థీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బాహుబలి 2 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవల బాహుబలి 2 కోసం ప్రభాస్, రమ్యక్రిష్ణలపై రామోజీ ఫిలింసిటీలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.

జనతా గ్యారేజ్ లేటెస్ట్ అప్ డేట్స్...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో...సంక్రాంతి కానుకగా రిలీజై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.

మంచు విష్ణు, రాజ్ తరుణ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..

మంచు విష్ణు, రాజ్ తరుణ్ కాంబినేషన్ లో ఓ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని జి.నాగేశ్వరరెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఎ.కె ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

నాని ఆడియోకి అతిథిగా మహేష్..

భలే భలే మగాడివోయ్ సినిమాతో సక్సెస్ సాధించిన యువ హీరో నాని నటిస్తున్న తాజా చిత్రం క్రిష్ణ గాడి వీర ప్రేమగాథ. ఈ చిత్రాన్ని హను రాఘవపూడి తెరకెక్కించారు. 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది.