విఘ్నాలు దాటుకుని.. ఫిబ్రవరి 18ని లాక్ చేసిన ‘'సన్ ఆఫ్ ఇండియా'

  • IndiaGlitz, [Wednesday,February 02 2022]

హీరోగా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా, నిర్మాతగా, విద్యావేత్తగా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు మంచు మోహన్ బాబు. అడపా దడపా గెస్ట్ రోల్స్ చేయడమే తప్పించి.. లీడ్ రోల్‌లో ఆయన హీరోగా నటించి చాలాకాలం అవుతోంది. ఈ క్రమంలో కలెక్షన్ కింగ్ లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘‘సన్ ఆఫ్ ఇండియా’’. ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. ఫిబ్రవరి 18న సన్ ఆఫ్ ఇండియా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు ‘దేశభక్తి అతని రక్తంలోనే ఉంది’ అంటూ ట్విట్టర్‌లో పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్ . మోహన్ బాబును వెండితెరపై చూసుకుని మూడేళ్లు గడుస్తోంది. సూర్య హీరోగా నటించిన ‘‘ఆకాశం నీ హద్దురా’’లో ఆయన చివరిసారి కనిపించారు.

డైమండ్‌ రత్నబాబు దర్శకత్వం వహిస్తోన్న సన్ ఆఫ్ ఇండియా చిత్రాన్ని 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ, శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మంచు విష్ణు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆల్‌మోస్ట్ షూటింగ్ పూర్తి కావొస్తోంది. దేశభక్తి నేపథ్యంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో మోహన్‌బాబు పవర్‌ఫుల్‌ రోల్‌ పోషించినట్లుగా పోస్టర్లు, గ్లింప్స్ చెబుతున్నాయి. ఆయన కోడలు, విష్ణు సతీమణి విరోనిక ఈ సినిమాలో మోహన్‌బాబుకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా వ్యవహరించారు. మ్యాస్ట్రో ఇళయరాజా స్వరాలు సమకూర్చారు. గతంలో మోహన్ బాబు నటించిన ఎన్నో సినిమాలకు ఇళయరాజా మ్యూజిక్ డైరెక్ట్ చేశారు. వీరిద్దరి కాంబినేషన్లో సూపర్ హిట్ పాటలు కూడా ఉన్నాయి. మళ్లీ ఇన్నాళ్లుకు వీరి కాంబినేషన్ సెట్ కావడంతో అంచనాలు పెరిగాయి.

ఇకపోతే.. మోహన్ బాబు సారథ్యంలో నడుస్తోన్న శ్రీవిద్యానికేతన్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరిన సంగతి తెలిసిందే. శ్రీ విద్యానికేతన్ కాలేజీకి యూనివర్సిటీ హోదా దక్కింది. ఈ విషయాన్ని కొద్దిరోజుల కిందట స్వయంగా పెదరాయుడు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రజలకు తెలియజేశారు.

More News

డార్లింగ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్: మార్చి 11న రాధేశ్యామ్.. స్వయంగా ప్రకటించిన ప్రభాస్

ఆర్ఆర్ఆర్‌ రిలీజ్ విషయంలో క్లారిటీ రావడంతో టాలీవుడ్‌లో పెద్ద కదలిక వచ్చింది. చిన్నా, పెద్దా సినిమాలు ఒకదాని వెంట మరొకటి కొత్త డేట్స్ అనౌన్స్ చేస్తున్నాయి.

చివరి షెడ్యూల్‌ జరుపుకుంటున్న జీ5 'గాలివాన' వెబ్‌ సిరీస్‌

‘జీ 5’... ఓటీటీ వేదిక మాత్రమే కాదు, అంతకు మించి.. ఎప్పటికప్పుడు వీక్షకులకు ఏదో ఒక కొత్తదనం అందించాలనే సంకల్పంతో అన్ని తరహాల సినిమాలు, ఒరిజినల్‌ మూవీస్‌ మరియు వెబ్‌ సిరీస్‌లతో వీక్షకుల

'పంచతంత్రం'లో కథా బ్రహ్మ బ్రహ్మానందం క్యారెక్టర్ టీజర్ విడుదల

కళా బ్రహ్మ బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య ప్రధాన తారాగణంగా రూపొందుతున్న చిత్రం 'పంచతంత్రం'.

చీప్ యాక్టర్‌‌తో పోల్చొద్దంటూ పోస్ట్.. స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చిన లావణ్య త్రిపాఠి

సోషల్ మీడియా వచ్చిన తర్వాత నెటిజన్లకు టార్గెట్‌గా మారుతున్నారు సెలబ్రిటీలు. చిన్న పోస్ట్ చేయడం పాపం.. అయినదానికి కానిదానికి వాళ్లను ట్రోల్ చేస్తున్నారు.

క్రిప్టో కరెన్సీకి కళ్లెం.. ఇండియాలో అందుబాటులోకి డిజిటల్ రూపీ

ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీ లావాదేవీలు రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పెట్టుబడులు పెట్టేవారు కూడా రోజురోజుకు విస్తరిస్తున్నారు. ఈ వ్యవహారం కేంద్రం దృష్టికి కూడా వచ్చింది.