మొదలైన మోహనకృష్ణ ఇంద్రగంటి మల్టీసారర్ మూవీ!

  • IndiaGlitz, [Wednesday,February 01 2017]

అర్ధవంతమైన చిత్రాలకు పెట్టింది పేరు మోహనకృష్ణ ఇంద్రగంటి. "జెంటిల్ మెన్" లాంటి సూపర్ హిట్ అనంతరం అడివి శేష్-అవసరాల శ్రీనివాస్ లు హీరోలుగా "ఎ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్" పతాకంపై ఓ మల్టీ స్టారర్ ను తెరకెక్కించనున్నారు. కె.సి.నరసింహారావు నిర్మించనున్న ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రంలో "అంతకు ముందు ఆ తర్వాత" ఫేమ్ ఈష, అదితి మ్యానికల్ కథానాయికలుగా నటించనుండగా.. యంగ్ అండ్ టాలెంటెడ్ కమెడియన్ వెన్నెల కిషోర్ ఓ ముఖ్యపాత్ర పోషించనున్నాడు. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం నేడు (ఫిబ్రవరి 1) జరిగింది.

ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణప్రసాద్ క్లాప్ కొట్టగా.. వినయ్ కెమెరా స్విచాన్ చేశారు. తనికెళ్ళ భరణి గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత, "ఎ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్" సంస్థ అధినేత కె.సి.నరసింహారావు మాట్లాడుతూ.. "నేడు పూజా కార్యక్రమాలతోపాటు రెగ్యులర్ షూట్ కూడా మొదలుపెట్టనున్నాం. అడివి శేష్, అవసరాల శ్రీనివాస్ లు కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఈష, అదితి మ్యానికల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మణిశర్మ గారు సంగీత సారధ్యం వహించనున్న ఈ చిత్రానికి పి.జి.విందా కెమెరా బాధ్యతలు నిర్వహించనున్నారు" అన్నారు.

తనికెళ్లభరణి, అనంత్, మధుమణి, కేదార్ శంకర్, వేణుగోపాల్, శ్యామల, తనికెళ్ళ భార్గవ్, తడివేలు తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మేకప్ చీఫ్: సి.హెచ్.దుర్గాబాబు, కాస్ట్యూమ్ డిజైనర్: ఎన్.మనోజ్ కుమార్, ప్రొడక్షన్ కంట్రోలర్: మోహన్ పరుచూరి, ప్రొడక్షన్ అడ్వైజర్: డి.యోగానంద్, కో-డైరెక్టర్: కోటా సురేష్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్: ఎస్.రవీందర్, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, సినిమాటోగ్రఫీ: పి.జి.విందా, మ్యూజిక్: మణిశర్మ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వినయ్, ప్రొడ్యూసర్: కె.సి.నరసింహారావు, రచన-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి!

More News

ఆ హీరోయిన్స్ మరోసారి కలిసి నటిస్తున్నారు..

గతంలో తెలుగులో బృందావనం, బ్రహ్మోత్సవం సినిమాల్లో కలిసి నటించారు. ఇప్పుడు మూడోసారి ఈ హీరోయిన్స్ కలిసి నటించనున్నారట.

తేజ్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్న మహేష్....

మెగా ఫ్యామిలీకి చెందిన హీరో సాయిధరమ్ తేజ్,ఇప్పుడు విన్నర్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రెడీ అవుతున్నాడు.

చరణ్ కు విలన్ గా...

హీరో ఆది పినిశెట్టి మరోసారి విలన్ గా నటించే సిద్ధమవుతున్నాడని ఫిలింనగర్ వర్గాల సమాచారం.

రాజశేఖర్ మూవీ ఫస్ట్ లుక్ డేట్...

పోలీస్,సి.బి.ఐ పాత్ర లకు హీరో డా.రాజశేఖర్ పెట్టింది పేరు.అంకుశం,అగ్రహం,మగాడు సహా పలు పోలీసు క్యారెక్టర్స్ లో

తెలంగాణ చేనేత అంబాసిడర్ గా సమంత...

హీరోయిన్ సమంత ఇప్పుడు చేనేత వస్త్రాలకు తెలంగాణ ప్రభుత్వ అధికారిక అంబాసిడర్ గా నియమితురాలైంది.