కిమ్‌తో నాలుగోసారి చర్చకు సిద్ధమైన మూన్‌ జే

  • IndiaGlitz, [Tuesday,April 16 2019]

ఉత్తర కొరియా-దక్షిణ కొరియా అధ్యక్షుల మధ్య ఇప్పటికే చర్చలు జరిగిన విషయం విదితమే. అయితే చర్చలు విఫలం కావడంతో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో నాలుగోసారి సమావేశం కావడానికి మేం సిద్ధంగా ఉన్నామని దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌ ప్రకటించారు. కాగా.. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్ మధ్య ఇప్పటికే రెండు సార్లు చర్చలు జరిగినప్పటికీ ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి రాలేకపోయిన విషయం విదితమే. ఇదిలా ఉంటే.. తాను మూడోసారి.. అమెరికాతో చర్చలు జరిపేందుకు సిద్ధమేనని కిమ్‌ ఇటీవల ప్రకటించారు.

ఉత్తరకొరియా ఎప్పుడు సిద్ధంగా ఉన్నా సరే.. మా ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతాయని మూన్ స్పష్టం చేశారు. కీలక, ఆచరణాత్మక చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నామని.. ఉత్తరకొరియా, అమెరికా మధ్య రెండు సదస్సులు జరిగాయన్నారు. ఈ విషయంలో మరింత పురోగతి సాధించే క్రమంలో ఉత్తరకొరియాతో మరోసారి సదస్సులో పాల్గొనాలని భావిస్తున్నామని దక్షిణ కొరియా అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. త్వరలోనే ఉత్తరకొరియాకు తమ ప్రతినిధులను పంపనున్నట్లు సమాచారం.

More News

ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ అనుమానాస్పద మృతి

ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్ తివారీ దేశ రాజధాని ఢిల్లీలో అనుమానాస్పద స్థితిలో కన్నుమూశాడు.

మెట్రోలో ప్రయాణిస్తున్న మహిళలూ తస్మాత్ జాగ్రత్త...

మెట్రోలో ప్రయాణించాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. రైలు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా అంతే సంగతులు.

నిహారిక కోసం సుకుమార్‌

మెగా ఫ్యామిలీ నుండి చాలా మంది హీరోలు తెలుగు సినిమాకు ప‌రిచ‌య‌మ‌య్యారు. అయితే ఈ ఫ్యామిలీ నుండి ప‌రిచ‌య‌మైన హీరోయిన్ నిహారిక కొణిదెల మాత్ర‌మే.

చిన్మ‌యి కెరీర్‌ను నాశనం చేస్తా - నిర్మాత రాజ‌న్‌

ద‌క్షిణాది మీ టూ ఉద్యమాన్ని సింగ‌ర్, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మ‌యి లీడ్ చేసిన సంగ‌తి తెలిసిందే.

టిక్‌టాక్ అభిమానులకు షాకింగ్ న్యూస్...!

అవును మీరు వింటున్నది నిజమే.. ఇకపై టిక్‌టాక్ కనిపించదు.! టిక్‌టాక్‌ను వెంటనే తమ ప్లేస్టోర్ల నుంచి తొలగించాలంటూ గూగుల్, యాపిల్ సంస్థలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.