జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఎంపీ కేశినేని ట్వీట్

  • IndiaGlitz, [Friday,August 09 2019]

టీడీపీ ఎంపీ కేశినేని నాని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలసిందే. ఎన్నికల ఫలితాల తర్వాత నెట్టింట చురుగ్గా ఉంటున్న నాని ప్రత్యర్థి పార్టీల నేతలను.. సొంత పార్టీల నేతలనూ వదలకుండా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ పార్టీ అధిష్టానానికి కూడా పెద్ద తలనొప్పిగా మారిన సందర్భాలున్నాయి. మరీ ముఖ్యంగా ఈయన ప్రత్యర్థి, వైసీపీ తరఫున పోటీచేసి ఓడిన పీవీపీతో పాటు పలువురు వైసీపీ నేతల గురించి విమర్శనాస్త్రాలు విసిరారు. అయితే ఉన్నట్టుండి ఏం జరిగిందో ఏమో గానీ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నిర్ణయాన్ని మెచ్చుకుంటూ ఓ కీలక ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ అటు సోషల్ మీడియాలో.. ఇటు టీడీపీలో చర్చనీయాంశమైంది.

నాని ట్వీట్ సారాంశం ఇదీ..!

సీఎం గారు... మీరు తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేను సమర్ధిస్తాను. కానీ ఈ పోర్టును తెలంగాణాకో, వాన్ పిక్ కో లేక ఇతర ప్రైవేట్ వారికో ధారాదత్తం చేయకుండా ప్రభుత్వమే చేపట్టే నిర్ణయం తీసుకుని మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి అని వైఎస్ జగన్‌కు ట్యాగ్ చేస్తూ నాని రాసుకొచ్చారు. ఈ ట్వీట్‌కు పలువురు వీరాభిమానులు, టీడీపీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీ ఎంపీ అయ్యుండి.. జగన్ నిర్ణయాలను స్వాగతించడమేంటి..? అని కన్నెర్రజేస్తున్నారు. కాగా, ఈ ప్రాజెక్టు పనులను సకాలంలో చేపట్టలేదన్న కారణంతో గతంలో మచిలీపట్నం పోర్ట్ లిమిటెడ్ కు ఇచ్చిన కాంట్రాక్టు ఒప్పందాన్ని జగన్ సర్కారు రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే.

More News

టీడీపీ ఘోర ఓటమికి అసలు కారణం తెలిసిందోచ్...!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కలలో కూడా ఊహించని రీతిలో కేవలం 23 స్థానాల్లో మాత్రమే గెలిచిన విషయం విదితమే.

ఉత్తమ చలన చిత్రంగా ‘మహానటి’

ఢిల్లీలో 66వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను ప్రకటించడం జరిగింది. కాగా తెలుగు చిత్రాలు పలు విభాగాల్లో పురస్కారాలు దక్కించుకోవడం విశేషమని చెప్పుకోవచ్చు.

పృథ్వీరాజ్‌ వ్యాఖ్యలకు రాజేంద్రప్రసాద్ స్ట్రాంగ్ కౌంటర్!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ సొంత సినిమా ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.

‘మేరాదోస్త్‌’ ఆడియో లాంచ్‌!!

వి.ఆర్‌.ఇంటర్నేషనల్‌ పతాకంపై పవన్‌, శై లజా హీరో హీరోయిన్లుగా జి.మురళి దర్శకత్వంలో పి.వీరారెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘మేరాదోస్త్‌’.

వి.కె.బి ఆర్ట్స్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం ప్రారంభం

ఆదిత్య ఓం, దిషా హీరో హీరోయిన్లు గా వి.కె.బి ఆర్ట్స్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 సినిమా శుక్రవారం (ఆగస్ట్ 9న) ఫిలిం నగర్ సాయిబాబా టెంపుల్ లో