మిస్టర్ కెకె అక్కడ బ్యాన్
- IndiaGlitz, [Sunday,July 21 2019]
విక్రమ్ కీలక పాత్రలో, అభి హాసన్, అక్షరా హాసన్ జంటగా నటించిన సినిమా 'మిస్టర్ కెకె'. కడారమ్ కొండాన్ అనే తమిళ సినిమాకు అనువాదమిది. విక్రమ్ సినిమాలు తెలుగుతో పాటు విదేశాల్లోనూ మంచి క్రేజ్ తెచ్చుకుంటాయి. ముఖ్యంగా మలేషియాలాంటి ప్రదేశాల్లో ఆయనకు అభిమానగణం ఎక్కువ. ఈ సినిమాకు నేపథ్యం కూడా మలేషియాలోని కౌలాలంపూరే. ఈ సినిమా మొత్తం అక్కడే జరుగుతుంది.
అయితే అక్కడి సెన్సార్ ఈ సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వలేదు. పైగా బ్యాన్ చేసింది. అందుకు సరైన కారణాలు కూడా ఏమీ వ్యక్తంచేయలేదు. దీంతో ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన సంస్థ ఆ విషయాన్ని ఫేస్బుక్ పేజీలో పెట్టేసింది. విక్రమ్ అభిమానులందరూ అసలు అంతగా ఆ సినిమా ఏం ఉందోనని సింగపూర్ వెళ్లి మరీ చూసొస్తున్నారట. మలేషియా, సింగపూర్ మధ్య విమానాలు బాగా రష్గా ఉన్నాయట. మిస్టర్ కెకెను కమల్హాసన్ నిర్మించారు. రాజేష్ ఎం సెల్వ దర్శకత్వం వహించారు. ఆయనే రచన చేసి, స్క్రీన్ప్లే చేసి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగానూ వ్యవహించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఆశించిన ఫలితాలు పొందలేదు.