close
Choose your channels

తహసీల్దార్ హత్యకేసు: నిందితుడి భార్య ఏమందంటే..!

Wednesday, November 6, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తహసీల్దార్ హత్యకేసు: నిందితుడి భార్య ఏమందంటే..!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి కేసు వ్యవహారంపై రోజుకో ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తోంది. ఇప్పటికే పలు మలుపులు తిరిగిన ఈ కేసులో తాజాగా.. నిందితుడు సురేష్ భార్య లత షాకింగ్ విషయాలు బయటపెట్టింది. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సురేష్‌ దగ్గరున్న ఆయన సతీమణిని తొలిసారిగా మీడియా పలకరించింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అసలు విషయమేంటో చెప్పుకొచ్చింది. ‘నా భర్తను ఎవరో పావులా వాడుకున్నారు. నా భర్త ఇలాంటి ఘోరాలు చేసే వ్యక్తి కాదు.. చాలా అమాయకుడు. వివాదానికి సంబంధించిన భూమి విషయమే మాకు తెలియదు. నా భర్త సురేశ్ ఇటీవల కొంత మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులతో తిరుగుతున్నాడు. అప్పట్నుంచే సదరు భూమి విషయం తెలిసి ఉండొచ్చు. ఉన్న పొలం అమ్ముకొని అప్పులు తీర్చుకుందామనుకుంటున్న సమయంలో ఇలా జరుగుతుందని ఊహించలేదు’ అని లత కన్నీరు పెట్టుకుంది. తన భర్తకు ఎవరో నూరిపోసి ఇదంతా చేయించారని.. పూర్తి విచారణ జరిపించి ఘటన వెనుక ఎవరున్నారో బయటపెట్టాలని ఈ సందర్భంగా లత ప్రభుత్వాన్ని కోరింది. తహసీల్దార్ విజయారెడ్డి హత్యపై సురేష్‌ భార్య లత తొలిసారిగా పెదవి విప్పి పై విధంగా చెప్పుకొచ్చింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.