close
Choose your channels

'ఎంఎస్ ధోనీ' చిత్రంలో నటించిన మరో నటుడి ఆత్మహత్య

Tuesday, February 16, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎంఎస్ ధోనీ చిత్రంలో నటించిన మరో నటుడి ఆత్మహత్య

‘ఎంఎస్ ధోనీ’ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఘటన మరువక ముందే అదే సినిమాలో నటించిన మరో నటుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్యతో ఇబ్బందులు పడలేకపోతున్నానని పేర్కొంటూ ఓ వీడియోను పోస్ట్ చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘ఎంఎస్ ధోనీ’ చిత్రంలో నటించిన నటుడు సందీప్ నహర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు సందీప్ తన ఫేస్‌బుక్‌లో వీడియో పోస్ట్ చేశాడు. తన భార్యతో పడలేకపోతున్నానని వీడియోలో వెల్లడించాడు.

అయితే తన ఆత్మహత్యకు కారణంగా తన భార్యను నిందించరాదని కోరాడు. సెల్ఫీ వీడియో తీసుకున్న అనంతరం ఆయన తన ప్రాణాలు తీసుకున్నాడు. ముంబై పోలీసులు కేసు నమోదు చేసి.. విచారణ ప్రారంభించారు. గత ఏడాది ఎంఎస్ ధోనీ చిత్రం హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య... తాజాగా అదే సినిమాలో నటించిన సందీప్ ఆత్మహత్య బాలీవుడ్‌లో కలకలం రేపుతోంది. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న సమయంలోనే సమస్యకు చావు పరిష్కారం కాదంటూ సెలబ్రిటీలు తోటి నటీనటులకు ధైర్యం చెప్పే యత్నం చేశారు. అయినప్పటికీ మరో నటుడు ఆత్మహత్యకు పాల్పడటంతో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.