మిస్టర్ కూల్ కు షాక్ ఇచ్చిన బీసీసీఐ

మిస్టర్ కూల్ కు షాక్ ఇచ్చింది బీసీసీఐ. 2019-20 కాంట్రాక్ట్ జాబితాలో ధోనీకి అవకాశం ఇవ్వలేదు. దీంతో అభిమానులు మండిపడుతున్నారు. ఏ కేటగిరీలో కూడా మహేంద్ర సింగ్ ధోనీ పేరు లేకపోవడం తో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాల్డ్ కప్ సాధించి పెట్టిన ఆటగాడికి మీరిచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆగ్రహంతో ఊగిపోతున్నారు.
అంటే ధోనీ కెరీర్ ముగిసిందా... అసలు ఇది దేనికి సంకేతం చెప్పాలి అంటూ అభిమానులు అవేదన చెందుతున్నారు.

అయితే ధోనీతో మాట్లాడిన తర్వాతే... బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు. రిటైర్మెంట్ విషయం ధోనీ బీసీసీఐ తో చెప్పడం వల్లే కాంట్రాక్ట్ జాబితాలో చోటు దక్కక పోవచ్చని అంటున్నారు. వన్డే లకు బై చెప్పి... టీ20 లు అడుతాడని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.