వెంకీ సినిమాకి ముహుర్తం కుదిరింది

  • IndiaGlitz, [Friday,January 19 2018]

తాజాగా విడుద‌లైన‌ అజ్ఞాత‌వాసి సినిమాలో అతిథి పాత్ర‌లో సంద‌డి చేశారు సీనియ‌ర్ క‌థానాయ‌కుడు విక్టరీ వెంకటేష్. ఇప్పుడు ఆయ‌న క‌థానాయ‌కుడిగా.. ఓ కొత్త చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. దీనికి సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు తేజ దర్శకత్వం వహించ‌నున్నారు.

ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు జరిగి నెల రోజులు కావొస్తున్నా..ఇంతవరకు ఈ సినిమా రెగ్యుల‌ర్‌ షూటింగ్ ప్రారంభించే తేదీని మాత్రం ఖరారు చేయలేదు చిత్ర యూనిట్. తాజాగా జనవరి 26వ తేదీ నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. ఈ వార్తతో ఇటు వెంకీ అభిమానులు, అటు తేజ ఫాన్స్ ఎదురుచూపులకి తెర పడినట్లైంది.

అలాగే ఈ సినిమాకి 'ఆటా నాదే వేటా నాదే' అనే టైటిల్‌ని కూడా కన్ఫర్మ్ చేశారు. సురేష్ ప్రొడక్షన్స్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి.. అనూప్ రూబెన్స్ స్వరాలను అందిస్తున్నారు. ఇక ఈ చిత్రం కోసం.. వెంకీకి జోడీగా ప‌లువురు కథానాయికల పేర్లు పరిశీలించినప్పటికీ...ఇంకా ఎవరిని ఖరారు చేయలేదు.

త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి నాయికల వివరాలతో పాటు మరిన్ని విషయాలను చిత్ర బృందం అధికారికంగా వెల్ల‌డిచేయ‌నుంది.

More News

'బగ్గిడి గోపాల్' షూటింగ్ ప్రారంభం!

బగ్గిడి ఆర్ట్ మూవీస్ పతాకంపై బగ్గిడి గోపాల్ ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మిస్తోన్న బయోపిక్ 'బగ్గిడి గోపాల్'.

'టిక్ టిక్ టిక్' ట్రైలర్ ను విడుదల చేసిన సాయిధరమ్ తేజ్

జయం రవి,నివేదా పేతురాజ్ హీరో హీరోయిన్లుగా చదలవాడ బ్రదర్స్ సమర్పణలో

అనుష్కకి విలన్ గా..

అరుంధతి,బాహుబలి చిత్రాల తరువాత మరోసారి అభినయానికి అవకాశమున్న పాత్రలో అనుష్క నటిస్తున్న చిత్రం భాగమతి.

రామ్ చరణ్ కి అత్త కాదట

బుల్లితెర సంచలనం అనసూయ..వెండితెర పైనా సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

రెగ్యులర్‌ షూటింగ్‌లో రామ్‌చరణ్‌, బోయపాటి భారీ చిత్రం

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో  కొత్త చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ శుక్రవారం హైదరాబాద్‌లో స్టార్ట్‌ అయ్యింది. శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌.ఎల్‌.పి బ్యానర్‌పై దానయ్య డి.వి.వి భారీ బడ్జెట్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.