close
Choose your channels

‘వేదాళం’ సినిమాకు ముహూర్తం కుదిరింది..!

Thursday, October 15, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘వేదాళం’ సినిమాకు ముహూర్తం కుదిరింది..!

మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య‌’ సినిమా పూర్తి కానేలేదు . కానీ.. త‌దుప‌రి రెండు సినిమాల‌ను ఆయ‌న లైన్‌లో పెట్టారు. ఈ రెండు సినిమాలు రీమేక్ సినిమాలే కావ‌డం విశేషం. మ‌ల‌యాళ చిత్రం ‘లూసిఫ‌ర్‌’, త‌మిళ చిత్రం ‘వేదాళం’ రీమేక్‌ల‌లో చిరంజీవి న‌టించ‌నున్నారు. ‘ఆచార్య‌’ త‌ర్వాత ఈ రెండు సినిమాలు సెట్స్‌పైకి వెళ్ల‌నున్నాయి. వీటిలో ‘లూసిఫర్’ సినిమాను వినాయక్ డైరెక్ట్ చేయనుండగా, ‘వేదాళం’ రీమేక్‌ను మెహ‌ర్‌ర‌మేశ్ డైరెక్ట్ చేయ‌నున్నారు. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు మెహ‌ర్ ర‌మేశ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోయే ‘వేదాళం’ సినిమాను అక్టోబ‌ర్ 20న లాంఛనంగా ప్రారంభించ‌నున్నార‌ట‌.

స్టార్స్ అందరూ వారి సినిమాలను సెట్స్ పైకి తీసుకెళుతున్న నేపథ్యంలో ‘ఆచార్య‌’ను కూడా సెట్స్‌పైకి తీసుకెళ్లే ఆలోచ‌న‌లో మేక‌ర్స్ ఉన్న‌ట్లు స‌మాచారం. క‌రోనా ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ్డ త‌ర్వాతే షూటింగ్‌ను స్టార్ట్ చేస్తార‌ట‌. నిరంజ‌న్ రెడ్డి, రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత‌లు. హైద‌రాబాద్‌లో చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుగుతున్న సమయంలో కరోనా వైరస్ ప్రభావంతో చిత్రీకరణ ఆగింది. అక్టోబర్‌లో సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.