జూన్ 30న మల్టీస్టారర్ 'శమంతకమణి'

  • IndiaGlitz, [Wednesday,May 24 2017]

నారా రోహిత్‌, సుధీర్‌బాబు, సందీప్ కిష‌న్‌, ఆది హీరోలుగా న‌టిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ చిత్రం 'శ‌మంత‌క‌మ‌ణి' షూటింగ్ పూర్త‌యింది. భ‌వ్య క్రియేష‌న్స్ ప‌తాకంపై వి.ఆనంద‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

చిత్ర నిర్మాత వి.ఆనంద‌ప్ర‌సాద్ మాట్లాడుతూ '''భ‌లే మంచి రోజు' ఫేమ్ శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో మ‌ల్టీస్టార‌ర్‌గా 'శ‌మంత‌క‌మ‌ణి' ని తెర‌కెక్కిస్తున్నాం. నారా రోహిత్‌, సుధీర్‌బాబు, సందీప్ కిష‌న్‌, ఆది చాలా చ‌క్క‌గా న‌టించారు. ప్ర‌తి ఒక్క‌రికీ ప్రామినెంట్ రోల్ ఉంటుంది. వాస్త‌వ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని శ్రీరామ్ క‌థ‌ను చిక్క‌గా అల్లుకున్నారు. ఓ వైపు వినోదాన్ని పంచుతూనే మ‌రో వైపు ఉత్కంఠ రేకెత్తిస్తుంది. థ్రిల్లింగ్ అంశాలు పుష్క‌లంగా ఉంటాయి. షూటింగ్ పూర్తి చేశాం. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. జూన్ 30న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం'' అని అన్నారు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ '' యువ క‌థానాయ‌కులు న‌లుగురితో మ‌ల్టీస్టార‌ర్ అన‌గానే ప్రాజెక్ట్ కు క్రేజ్ వ‌చ్చింది. భ‌వ్య క్రియేష‌న్స్ ఆనంద‌ప్ర‌సాద్‌గారు క‌థ విన‌గానే సినిమా చేయ‌డానికి ముందుకొచ్చారు. ఇందులో ప్ర‌తి ఒక్క‌రి పాత్రా జ‌నాల‌కు క‌నెక్ట్ అవుతుంది. ఎంట‌ర్‌టైన్‌మెంట్ విత్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సినిమా చేశాం. యూత్‌తో పాటు అంద‌రికీ న‌చ్చుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది'' అని తెలిపారు.

డా.రాజేంద్ర‌ప్ర‌సాద్‌, చాందినీ చౌద‌రి, జెన్నీ హ‌నీ, అన‌న్యా, సోనీ, ఇంద్ర‌జ‌, క‌స్తూరి, సుమ‌న్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, హేమ‌, సురేఖావాణి, 'స‌త్యం' రాజేశ్‌, బెన‌ర్జీ, 'అదుర్స్' ర‌ఘు త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ధారుల్లో న‌టించిన ఈ సినిమాకు సంగీతం: మ‌ణిశ‌ర్మ‌, కెమెరా: స‌మీర్ రెడ్డి, ఆర్ట్: వివేక్ అన్నామ‌లై, ఎడిటింగ్‌: ప‌్ర‌వీణ్ పూడి, నిర్మాత‌: వి.ఆనంద‌ప్ర‌సాద్‌, క‌థ - స్క్రీన్‌ప్లే - మాట‌లు - ద‌ర్శ‌క‌త్వం: శ‌్రీరామ్ ఆదిత్య‌.

More News

బన్ని కొడుకు మహేష్ ఫ్యాన్....

సాధారణంగా పిల్లల మనసులో ఏ రాగద్వేషాలుండవు. వారికి నచ్చింది చేస్తుంటారు, చెబుతుంటారు. ఇప్పుడు అసలు విషయంలోకి వస్తే మెగా ఫ్యామిలీ అయినా, అల్లు ఫ్యామిలీ హీరోలకు వారి అభిమాన హీరో ఎవరంటే చెబితే మెగాస్టార్ చిరంజీవి పేరునో, పవర్స్టార్ పవన్కళ్యాణ్ పేరునో చెబతుంటారు.

రజనీకాంత్ సినిమాలో నటిస్తున్న దర్శకుడు...

దర్శకుడుగా సినీ అభిమానులకు పరిచయమైన సముద్ర ఖని తర్వాత ఎన్నో సినిమాల్లో నటుడిగా కూడా మెప్పించాడు. తన నటనతో జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు.

దువ్వాడ సాంగ్ సెన్సేషన్

ఆర్య నుండి సరైనోడు వరకు డిఫరెంట్ చిత్రాలతో తెలుగు చిత్రసీమలో స్టైలిష్ స్టార్గా తనదైన ముద్ర వేసుకున్న హీరో అల్లుఅర్జున్. రీసెంట్ బ్లాక్ బస్టర్ సరైనోడు చిత్రంతో తన స్టామినాను మరోసారి ప్రూవ్ చేసుకున్నబన్ని తెలుగులో చిత్ర సీమలోనే కాదు, మలయాళ సినీ పరిశ్రమలో కూడా తనదైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు.

చివరి సాంగ్ రికార్డింగ్ లో 'విశ్వరూపం-2'

లోకనాయకుడు కమల్హాసన్ దర్శకనిర్మాణంలో తెరకెక్కుతోన్న చిత్రం 'విశ్వరూపం2'. ఎప్పుడు సినిమా రూపొందిన విడుదల్లో మాత్రం కొన్ని కారణాల కారణంగా జాప్యం జరుగతూ వచ్చింది. ఈలోపు కమల్హాసన్ ఉత్తమవిలన్, చీకటి రాజ్యం సినిమాలు విడుదలయ్యాయి.

తమిళ్ సినిమా చేయనున్న రాజశేఖర్

ఆహుతి, అంకుశం, మగాడు వంటి చిత్రాల్లో పవర్ క్యారెక్టర్స్తో మెప్పించిన యాంగ్రీ యంగ్ మేన్ డా.రాజశేఖర్ ఇప్పుడు పిఎస్వి గరుడ వేగ 125.18 సినిమాలో ఇన్విస్టిగేషన్ ఆఫీసర్ పాత్రలో కనపడుతున్నాడు.