close
Choose your channels

మహిళను పొదల్లోకి ఈడ్చుకెళ్లి హత్యాయత్నం.. వారే లేకుంటే...

Thursday, March 4, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఓ వ్యక్తి.. ఒక మహిళను ఈడ్చుకుంటూ పొదల్లోకి తీసుకెళ్లాడు. ఆమె గొంతు నులిమి హత్య చేసేందుకు యత్నిస్తుండగా.. ఆమె కేకలు వేసింది. స్థానికులు వచ్చి వారించేందుకు యత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో సదరు మహిళను రక్షించేందుకు ఆ వ్యక్తిపై రాళ్లదాడికి పాల్పడ్డారు. ఎట్టకేలకు మహిళను రక్షించగలిగారు. అయితే ఆ వ్యక్తి ఎవరో కాదు.. ఆమె భర్తేనని తెలుసుకుని స్థానికులు షాక్ అయ్యారు.

ఖమ్మం పట్టణంలోని టీఎన్జీవోస్ కాలనీ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చిలకకోయలపాడుకి చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి రోడ్డు పక్కన ముళ్లకంపలోకి నవ్య అనే మహిళను తీసుకెళ్లి... ఆమెను చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి గొంతు నులిమి దారుణంగా హత్య చేయబోయాడు. ఇంతలో నవ్య కేకలు విన్న స్థానికులు అతడిని వారించబోయారు. అయినా పట్టువీడని రాక్షసుడు ఆమెను హత్య శతవిధాలా ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహం చెందిన జనం అతడిపై రాళ్ల దాడికి పాల్పడ్డాడు. అయినా నాగేశ్వరరావు పట్టువీడవకుండా భార్యను అంతమొందించాలని చూశాడు. స్థానికులు రాళ్లతో కొట్టి ఎట్టకేలకు నవ్యను నాగేశ్వరరావు బారి నుంచి ప్రాణాలతో రక్షించారు.

నవ్యను రక్షించిన అనంతరం ఆమెను హత్య చేయబోయింది ఆమె భర్తేనని తెలుసుకుని స్థానికులు అవాక్కయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తీవ్రగాయాలపాలైన భార్యను అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. కొంతకాలంగా నాగేశ్వరరావు వేధింపులు తాళలేక నవ్య దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. పిల్లలను తీసుకుని ఏన్జీవోస్ కాలనీలో నవ్యకు అద్దెకు ఉంటున్న విషయం తెలుసుకున్న భర్త ఆమెను ఎలాగైనా హతమార్చాలని వచ్చాడు. ప్లాన్ ప్రకారమే ఎన్జీవోస్ కాలనీలోని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి గొంతునులిమి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. స్థానికులు చూడడంతో నవ్య బతికి బయటపడింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.