close
Choose your channels

ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి మరో అట్రాక్షన్: మ్యూజిక్ డైరెక్టర్ అతుల్ సాహసం.. బైక్‌పై ముంబై నుంచి తిరుపతికి

Saturday, June 3, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి మరో అట్రాక్షన్ : మ్యూజిక్ డైరెక్టర్ అతుల్ సాహసం .. బైక్‌పై ముంబై నుంచి తిరుపతికి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘‘ఆదిపురుష్’’. ఎన్నో అవాంతరాలు, ఆటుపోట్లను ఎదుర్కొన్న ఈ చిత్రం ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. గతంలో టీజర్ సందర్భంగా చోటు చేసుకున్న పొరపాట్లను చక్కదిద్దిన చిత్ర యూనిట్.. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అలాగే పాటలు కూడా బాగున్నాయన్న రెస్పాన్స్ వచ్చింది. ఇక జూన్ 6న ఆదిపురుష్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా ఈ నెల 6న తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా చేయనున్నారు. భారతదేశ సినీ చరిత్రలో గతంలో ఎన్నడూ జరగని విధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ముంబై నుంచి వందలాది మంది డ్యాన్సర్లు, సింగర్లు రానున్నారట. అంతేకాదు.. కనివినీ ఎరుగని రీతిలో బాణా సంచాను కూడా కాల్చనున్నారట. శ్రీరామ్ అనే శబ్ధం వచ్చేలా ఇవి వుంటాయని టాక్.

ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి మరో అట్రాక్షన్ : మ్యూజిక్ డైరెక్టర్ అతుల్ సాహసం .. బైక్‌పై ముంబై నుంచి తిరుపతికి

శ్రీవారి పాదాల వద్ద జై శ్రీరామ్ పాటను సమర్పించనున్న అతుల్ - అజయ్ :

ఇదిలావుండగా.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మరింత స్పెషల్‌గా మార్చేందుకు సిద్ధమయ్యారు ఈ చిత్ర సంగీత దర్శకుడు అతుల్. బైక్‌పై ముంబై నుంచి తిరుపతికి రానున్నారు. అతుల్ జూన్ 3న ముంబైలో బయలుదేరి జూన్ 5న తిరుపతికి చేరుకోనున్నారు. అనంతరం తన సోదరుడు అజయ్ తో కలిసి ఆ వెంకటేశ్వర స్వామి పాదాల వద్ద జైశ్రీరామ్ పాటను సమర్పించనున్నారు. వెంకటేశ్వర స్వామి, శ్రీ రాముడు కూడా ఆ విష్ణు మూర్తి అవతారాలే కాబట్టి ఆయన్ని దర్శించుకుని సినిమా బాగా ఆడాలని కోరుకోబోతున్నారు. సాధారణంగా, ఇలాంటి పనుల‌ను బైక్ రైడర్స్ చేస్తూ ఉంటారు. అయితే తొలిసారిగా ఓ మ్యూజిక్ డైరెక్టర్ సినిమాపై తనకున్న ప్రేమను చాటుకునేందుకు ఈ విధంగా ముంబై నుంచి తిరుపతికి బైక్ రైడ్ చేయబోతున్నాడు. ఇది కూడా ఆదిపురుష్ సినిమాకి కలిసొస్తుందని విశ్లేషకులు అంటున్నారు.

ఇకపోతే.. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో ఆదిపురుష్‌ను తెరకెక్కిస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, రావణుడిగా సైఫ్ అలీఖాన్, లక్ష్మణుడిగా సన్నీసింగ్, హనుమంతుడిగా దేవదత్త నాగే నటిస్తున్నారు. వీరితో పాటు వత్సల్ సేథ్, సోనాల్ చౌహాన్, తృప్తి తోరడమల్ కీలక పాత్రలు షోషిస్తున్నారు. టీ-సిరీస్‌, రెట్రో ఫైల్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.