close
Choose your channels

Devi Sri Prasad: "బాస్‌తో బ్రేక్‌ఫాస్ట్"... చిరంజీవి ఇంటికి దేవిశ్రీ ఎందుకెళ్లినట్లు..?

Monday, April 24, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాస్‌తో బ్రేక్‌ఫాస్ట్... చిరంజీవి ఇంటికి దేవిశ్రీ ఎందుకెళ్లినట్లు..?

దేవి శ్రీ ప్రసాద్.. టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌. కొత్తగా ఎంతమంది వస్తున్నా.. ఇప్పటికీ టాప్ ప్లేస్ ఆయనదే. దాదాపు పాతికేళ్లుగా చిత్ర సీమకు సేవ చేస్తున్న దేవికి ఇప్పటికీ యువతలో అదే క్రేజ్ వుందంటే దానికి ఆయన చేసిన సినిమాలు, అందించిన స్వరాలే కారణం. ముఖ్యంగా ఫుల్ ఎనర్జీతో వుండే దేవిశ్రీ ప్రసాద్ తను వున్న ప్రాంతాన్ని జోష్‌తో నింపేస్తారు. ఇకపోతే.. డీఎస్పీకి మెగాస్టార్ చిరంజీవి అంటే ప్రత్యేకమైన అభిమానం. తన తండ్రి సత్యమూర్తి కాలం నుంచే మెగా ఫ్యామిలీతో ఆయనకు అనుబంధం వుంది. ఆ అభిమానంతోనే చిరంజీవి సినిమాలకు అదిరిపోయే బీట్స్ అందించారు దేవి. మెగాస్టార్‌పై తనకున్న అభిమానాన్ని పలు వేదికలపై ప్రస్తావిస్తూనే వుంటారు.

బాస్‌తో బ్రేక్‌ఫాస్ట్... చిరంజీవి ఇంటికి దేవిశ్రీ ఎందుకెళ్లినట్లు..?

ఇదిలావుండగా.. ఇటీవల మెగాస్టార్ చిరంజీవిని కలిశారు దేవిశ్రీ ప్రసాద్. అంతేకాదు.. తన అభిమాన నటుడితో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. బాస్‌తో బ్రేక్‌ఫాస్ట్ చేశానని.. ఆయనను కలిసిన ప్రతీసారీ చాలా ప్రత్యేకంగా ఫీలవుతానని దేవిశ్రీ అన్నారు. బాస్‌తో వున్న తనను ఫోటో తీసినందుకు చిరంజీవి కుమార్తె సుస్మితకు థ్యాంక్స్ చెప్పారు దేవి. అయితే వీరిద్దరూ ఎందుకు కలుసుకున్నారనే దానిపై ఫిలింనగర్‌లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

ఇక దేవిశ్రీ చివరిసారిగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య సినిమాకు స్వరాలు సమకూర్చారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ - హరీశ్ శంకర్‌లో తెరకెక్కుతోన్న ఉస్తాద్ భగత్ సింగ్.. త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న పుష్ప 2కి సంగీతం అందిస్తున్నారు. ఇవి రెండు క్రేజీ కాంబినేషన్‌లు కావడంతో దేవిశ్రీ ప్రసాద్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడోనని మ్యూజిక్ లవర్స్ ఎదురుచూస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.