'నమస్తే నేస్తమా' లో హాస్యంతో పాటు ఎమోషనల్‌ ఉండే క్యారెక్టర్ చేశా - బ్రహ్మానందం

  • IndiaGlitz, [Monday,November 11 2019]

కె.సి. బొకాడియా చలనచిత్ర రంగంలో పరిచయం అవసరంలేని పేరు. ఎంద‌రో  స్టార్‌హీరోలను, హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేసి, వేగంగా 50 సినిమాలు కంప్లిట్‌ చేసిన బాలీవుడ్‌ పాపులర్‌ ఫిలిం మేకర్‌. లేటెస్ట్‌గా లలిత్‌ మోడీ, గౌతమ్‌చంద్‌ రాథోర్‌ సమర్పణలో కె.సి.బొకాడియా నిర్మిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం 'నమస్తే నేస్తమా'. గతంలో ఆయన నిర్మాణంలో బ్లాక్‌బస్టర్‌హిట్‌ సాధించిన 'తేరి మెహర్భానియా' చిత్రానికి పార్ట్‌-2 వస్తోన్నఈమూవీ ద్వారా తెలుగు పరిశ్రమకి పరిచయమవుతున్నారు కె.సి.బొకాడియా. ఈషానియ మహేశ్వరి, నాజర్‌, బ్రహ్మానందం, షాయాజీ షిండే, తాగుబోతు రమేష్‌, చమక్‌ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలో యువ న‌టుడు  శ్రీరామ్ గెస్ట్ అప్పీయ‌రెన్స్ ఇస్తున్నారు.  ఈ చిత్రానికి బప్పిలహరి, చరణ్‌ అర్జున్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో రెండు కుక్క‌లు ముఖ్య పాత్రలు పోషించ‌డం విశేషం. త్వరలో విడుదల కాబోతున్న‌ సందర్భంగా ...

నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ - కె సి బొకాడియా గారు నిర్మించి తొలి సారి తెలుగులో దర్శకత్వం వహించిన సినిమా నమస్తే నేస్తమా. ఈ సినిమాలో నేను హాస్యమే కాకుండా కొంచెం ఎమోషనల్ గా ఉండే క్యారెక్టర్ చేశాను. నాకు చాలా సంతృప్తిని ఇచ్చిన క్యారెక్టర్. బొకాడియా గారు నిర్మాతగా చాలా  ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఆయనతో సినిమా చేస్తున్నపుడు ఏ రకమైన టెన్షన్ లేకుండా ఎంతో హ్యాపీగా తనకు కావాల్సినటువంటి రీతిలో ఆర్టిస్టుల నుండి కావాల్సిన పెర్ఫామెన్స్ రాబట్టుకుని అద్భుతమైన సినిమా నిర్మించారు.  నమస్తే నేస్తమా సినిమా థియేటర్ లో చూడండి. పర్టిక్యులర్‌గా నా క్యారెక్టర్ బాగుంటుందని మీకు చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్అన్నారు

శ్రీరామ్‌(గెస్ట్ అప్పీయ‌రెన్స్), ఈషానియ మహేశ్వరి, నాజర్‌, బ్రహ్మానందం, షాయాజీ షిండే, తాగుబోతు రమేష్‌, చమక్‌ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: అజ్మల్‌ఖాన్‌, సంగీతం: బప్పిలహరి, చరణ్‌ అర్జున్‌, ఎడిటర్‌: బి. లెనిన్‌, ఫైట్స్‌: బి.జె శ్రీధర్‌, సమర్పణ: లలిత్‌ మోడీ, గౌతమ్‌చంద్‌ రాథోర్‌, కో-ప్రొడ్యూసర్‌: ఎస్‌.ఆర్‌ చాప్లాట్‌, నిర్మాత: బి.ఎం.బి మ్యూజిక్‌ అండ్‌ మాగ్నెటిక్స్‌ లిమిటెడ్‌, ర‌చ‌న‌- దర్శకత్వం: కె.సి. బొకాడియా.

More News

‘RRR’ రిలీజ్‌ ప్లాన్‌ మారుతుందా?

ప్రస్తుతం టాలీవుడ్‌లో రూపొందుతోన్న ప్రెస్టీజియస్‌ ప్రాజెక్ట్‌ ‘RRR’. దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో

హాలీవుడ్‌ సినిమాకు డబ్బింగ్‌ చెప్పనున్న మహేశ్‌ కుమార్తె

సూపర్‌స్టార్‌ మహేశ్‌ కుమార్తె సితార ఓ హాలీవుడ్‌ మూవీకి డబ్బింగ్‌ చెప్పనుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది.

డిసెంబర్ 6 న 'బ్యూటిఫుల్' విడుదల

రాంగోపాల్ వర్మకు చెందిన టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై రూపొందిన తాజా చిత్రం బ్యూటిఫుల్. (ట్రిబ్యూట్ టు రంగీలా ఉప శీర్షిక).

'చీమ - ప్రేమ మధ్యలో భామ!' డిసెంబర్  విడుదల

మాగ్నమ్ ఓపస్  (Magnum Opus ) పతాకం పై మిస్టర్ ఇండియా, మిస్ తెలంగాణ అభ్యర్థులు అమిత్, ఇందు ప్రధాన పాత్రలలో శ్రీకాంత్ "శ్రీ" అప్పలరాజు దర్శకత్వం లో

‘పవన్.. మీ ముగ్గురు భార్యల పిల్లలు ఎక్కడ చదువుతున్నారు?’

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధన ప్రవేశపెడుతున్న సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.