నా భర్త ఏ తప్పూ చేయలేదు.. పారిపోవాల్సిన ఖర్మేంటి!?

  • IndiaGlitz, [Monday,October 14 2019]

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం కర్నూలు జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ కుటుంబం ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే సేవ్ ఆళ్లగడ్డ అంటూ యురేనియం తవ్వకాలను ఆపడమే కాకుండా.. ప్రజల పక్షాన నిలబడతామని బల్ల గుద్దీ మరిచెబుతున్నారు అఖిల. ఇక అసలు విషయానికొస్తే.. మాజీ మంత్రి భర్తపై ఇప్పటికే పలు కేసులు ఉండగా.. ఇటీవల పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారని కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఈ తతంగం అంతా కర్నూలు జిల్లా అంటే ఏపీలో జరగ్గా.. భూమా ఫ్యామిలీ హైదరాబాద్‌లో ఉండగా ఇక్కడికి ఆ కేసులన్నీ తరుముకొస్తున్నాయి. అక్కడి పోలీసులు హైదరాబాద్‌కు వచ్చి మరీ కేసు విషయంలో అఖిల భర్తను అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై తాజాగా ఓ ఇంటర్వ్యూ వేదికగా భూమ అఖిల కాసింత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

తన భర్తపై తప్పుడు కేసులు పెడుతున్నారని, పరారీలో ఉండాల్సిన అవసరం ఆయనకు లేదని.. మేం ఫ్యాక్షన్ కేసులకే భయపడలేదని, ఇలాంటి కేసులకు భయపడతామా? అంటూ అఖిల వ్యాఖ్యానించారు. భూమా కుటుంబం పరువు తీయడానికే తప్పుడు కేసులు పెట్టినట్టు అర్థమవుతోందన్నారు. అంతేకాదు.. గతంలో భూమా నాగిరెడ్డిపైనా ఇలాంటి కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారని.. ఇప్పుడు కూడా తన భర్తనే అదే విధంగా ఇబ్బందులు పెడుతున్నారని అఖిలి చెప్పుకొచ్చారు. ఎలాంటి తప్పు చేయకపోయినా అన్యాయంగా కేసులు పెట్టారని ఆమె ఆరోపిస్తున్నారు. మేమేం తప్పుచేయలేదు.. పారిపోవాల్సిన ఖర్మ మా ఆయనకు పట్టలేదని అఖిల చెప్పారు.

తన భర్త ఎలాంటి తప్పు చేయలేదని తనకూ తెలుసు, కేసు పెట్టినవాళ్లకూ తెలుసు, పోలీసులకూ తెలుసంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒక చిన్న సివిల్ కేసును అటెంప్ట్ మర్డర్ కేసుగా మార్చేందుకు పోలీసులు ఎందుకింతగా ఇన్వాల్వ్ అవుతున్నారో మాకు అర్థం కావడంలేదన్నారు. అయితే పోలీసుల వాదన మాత్రం ఇంకోలా ఉంది.. ఈ క్రమంలో ఈ కేసు వ్యవహారం ఎంతవరకూ వెళ్తుందో వేచి చూడాల్సిందే మరి.

More News

అమెరికా వెళ్లనున్న ప్రతిరోజూ పండగే చిత్ర బృందం

ఇటీవలే చిత్రలహరి చిత్రంతో మంచి విజయం అందుకొన్న సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా భలే భలే మగాడివోయ్, మహానుభావుడు వంటి బంపర్ హిట్ చిత్రాలకు

సినిమా షూటింగ్ పూర్తి.. హిమాల‌యాల‌కు ర‌జ‌నీ

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ త‌న 167వ సినిమా `ద‌ర్బార్‌` చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌ర‌గుతున్నాయి.

నాగశౌర్య హీరోగా సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో చిత్రం ప్రారంభం

యంగ్‌ హీరో నాగశౌర్య హీరోగా సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌.ఎల్‌.పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి

'జెర్సీ' బాలీవుడ్ రీమేక్‌కి రంగం సిద్ధం

ఈ ఏడాది తెలుగు చిత్రం `అర్జున్ రెడ్డి`ని హిందీలో `క‌బీర్‌సింగ్‌` పేరుతో రీమేక్ చేసిన సంగ‌తి తెలిసిందే.

ఆర్టీసీ.. ఆ ఒక్కటీ వద్దు.. కేసీఆర్ నిర్ణయం సరైనదే!

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టడం.. ఇప్పటికే ఇద్దరూ కార్మికులు బలిదానాలు కావడంతో రాష్ట్రంలో పరిస్థితులు