హిట్ డైరెక్ట‌ర్‌ని లాక్ చేసిన మైత్రీ మూవీస్‌..!!

  • IndiaGlitz, [Monday,August 03 2020]

ప్ర‌స్తుతం తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో ప్ర‌స్తుతం ఉన్న అగ్ర నిర్మాణ సంస్థ‌ల్లో మైత్రీ మూవీ మేక‌ర్స్ ఒక‌టి. చిరంజీవి, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, ప్ర‌భాస్‌, మ‌హేశ్‌, అల్లు అర్జున్ వంటి స్టార్స్‌తో భారీ బ‌డ్జెట్ చిత్రాలు, ఆ నెక్ట్స్ రేంజ్ హీరోల‌తో మీడియం బ‌డ్జెట్ చిత్రాలు చేస్తూ గుర్తింపును సంపాదించుకుందీ సంస్థ‌. ఇప్పుడు ఈ సంస్థ ఓ యంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌తో సినిమా చేయ‌డానికి నిర్ణ‌యించుకుంద‌ట‌. అందుకోసం అత‌ని అడ్వాన్స్ ఇచ్చి ఓ బై లింగ్వువ‌ల్‌(తెలుగు, త‌మిళం)లో ఓ సినిమా చేయ‌డానికి ఒప్పందం చేసుకుంద‌ని అంటున్నారు. ఇంత‌కూ ఎవ‌రా డైరెక్ట‌ర్‌?.. లోకేష్ క‌న‌క‌రాజ్‌.

లోకేష్ క‌న‌క‌రాజ్.. త‌మిళ ద‌ర్శ‌కుడు ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సినిమాల‌ను డైరెక్ట్ చేస్తే అందులో రెండు సినిమాలు సూప‌ర్ డూప‌ర్ హిట్స్ సాధించాయి. ఓ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. సందీప్ కిష‌న్‌తో ‘న‌గ‌రం’, కార్తీతో ‘ఖైదీ’ చిత్రాల‌ను లోకేష్ డైరెక్ట్ చేశారు. ఈ రెండు చిత్రాలు అటు త‌మిళం, ఇటు తెలుగులో ఘ‌న విజ‌యాల‌ను సాధించాయి. ఇప్పుడు కోలీవుడ్ అగ్ర హీరో విజ‌య్‌తో ‘మాస్ట‌ర్’ సినిమాను తెర‌కెక్కించాడు. ఇది విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. కాగా.. ఇప్పుడు ఈ డైరెక్ట‌ర్ తెలుగులో ఎవ‌రితో సినిమా చేస్తాడనే ఆస‌క్తి అంద‌రిలో పెరిగింది. మైత్రీ మూవీ మేక‌ర్స్ ప్ర‌స్తుతం తెలుగులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో ‘పుష్ప’ సినిమాను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.

More News

ఛానెల్ ఎడిట‌ర్‌పై ఆర్జీవీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. సినిమా చేస్తాన‌ని ప్ర‌క‌ట‌న‌

ఈ లాక్‌డౌన్ స‌మ‌యంలో షూటింగ్‌ల‌కు మేక‌ర్స్ దూరంగా ఉంటున్నారు.

చెన్నై సేఫ్ అంటున్న త‌లైవా అండ్ టీమ్‌!!

మ‌న సీనియ‌ర్ స్టార్స్ అంద‌రూ షూటింగ్స్ స్టార్ట్ చేయాలంటే భ‌య‌ప‌డుతున్నారు. వీరిని ఇంత‌లా భ‌య‌పెడుతున్నదెవ‌రో కాదు..

ఆరు గెట‌ప్స్‌లో ఎన్టీఆర్‌

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న ప్రెస్టీజియ‌స్ చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)’.

సుశాంత్‌ని దారుణంగా కొట్టి చంపారు.. ఆధారాలతో వెల్లడించిన డాక్టర్ మీనాక్షి

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు రకరకాల మలుపులు తిరుగుతోంది. పోస్టుమార్టం రిపోర్టు సుశాంత్‌ది ఆత్మహత్య అని తేల్చింది.

ఇళ‌య‌రాజాపై నిర్మాత సంచ‌ల‌న వ్యాఖ్యలు

మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా ప్ర‌సాద్ ల్యాబ్స్ నుండి త‌న‌ను బ‌ల‌వంతంగా బ‌య‌ట‌కు పంపుతున్నార‌ని, త‌న వాయిద్య ప‌రిక‌రాల‌ను నాశ‌నం చేశారంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే.