ఈ నెల 29న 'నా లవ్ స్టోరి'

  • IndiaGlitz, [Wednesday,June 20 2018]

అశ్వని క్రియేషన్స్ బ్యానర్ పై జి. లక్ష్మి నిర్మాతగా, శివగంగాధర్ దర్శకత్వంలో మహిధర్ , సోనాక్షి సింగ్ రావత్ లను వెండితెరకు పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం 'నా లవ్ స్టోరీ'. ప్రేమ కథలలో ప్రత్యేకంగా నిలుస్తుందనే అంచానాలను తెచ్చుకున్న ఈ మూవీ ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవలే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ కు, పాటలకు మంచి రెస్సాన్స్ వచ్చింది.

ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా నిర్మాత లక్ష్మి మాట్లాడుతూ బొమ్మరిల్లు లాంటి క్యూట్ లవ్ స్టోరి, యూత్ అండ్ ఫ్యామిలీ చూడవలసిన సినిమా 'నా లవ్ స్టోరి' అని, హీరో, హీరోయిన్ల్ కొత్తవారైనా సీనియర్స్ కి ధీటుగా బాగా చేశారని, శివన్నారాయణ, తొటపల్లి మధు కామెడీ కడుపుబ్బ నవ్వింస్తుందని, ఇందులోని రెండు సాంగ్స్ నార్త్ బ్యాంకాక్ లోని 'చియాంగ్ మై' లో షూట్ చేశాం. హీరో, హీరోయిన్స్ కి ఈ సినిమాతో మంచి పేరు వస్తుంది. అన్నారు.

డైరెక్టర్ శివగంగాధర్ మాట్లాడుతూ... కాలేజ్ లో అడుగు పెడుతున్న యూత్ కి, ముఖ్యంగా ఆడపిల్లలకి, కొత్తగాప్రేమలో పడేవాళ్ళకి ఆల్ రెడీ ప్రేమలో ఉన్న వారికి ప్రేమపై క్లారిఫికేషన్ ఇచ్చిన స్టోరి 'నా లవ్ స్టోరి'. 'అష్టాచమ్మా', 'ఉయ్యాలా జంపాలా', 'పెళ్ళి చూపులు' లాంటి నేచురల్ లవ్ స్టోరి అని, కొత్త వాళ్ళైనా బాగా చేశారని, ఈ సినిమా చూసి మీరే చెప్తారు.

ఇటీవల విడుదల చేసిన ట్రైలర్స్ కి, సాంగ్ ప్రోమోస్ కి మంచి రెస్సాన్స్ వచ్చింది. ప్రేమ లో వచ్చే అవరోధాలను విభిన్నమైన కోణంలో చర్చించడం జరిగింది. ట్రైలర్ కి, పాటలకు మంచి రెస్సాన్ రావడం ఆనందంగా ఉంది. సినిమా తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉంది అన్నారు.

More News

'ఐపీసీ సెక్షన్ భార్యాబంధు' అన్ని సెక్షన్స్ ఆడియన్స్ కీ నచ్చుతుంది - ఆలూరి సాంబశివరావు

ఆయన మొదట కెమెరామెన్ కావాలని కలలు కన్నారు. కుదరలేదు. దాంతో తనే సొంతంగా సినిమా నిర్మించే స్థాయికి ఎదగాలని డిసైడ్ అయి.. కొన్నాళ్ళు  కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేసి, తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ చేసి

అభిమన్యుడు చాలా నచ్చింది - నితిన్

మాస్ హీరో విశాల్ హీరో గా సమంత, యాక్షన్ కింగ్ అర్జున్ ముఖ్య పాత్రల్లో పి.ఎస్. మిత్రన్ ని దర్శకునిగా పరిచయం చేస్తూ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ, హరి వెంకటేశ్వర పిక్చర్స్

జూలై 14న 'ఆట‌గ‌ద‌రా శివ‌' విడుద‌ల‌

'ప‌వ‌ర్‌', 'లింగా', 'బ‌జ‌రంగీ భాయీజాన్‌' వంటి భారీ చిత్రాల నిర్మాత రాక్‌లైన్ వెంక‌టేశ్ నిర్మిస్తోన్న తాజా చిత్రం 'ఆట‌గ‌ద‌రా శివ‌'.

'పంతం' సెకండ్ సాంగ్‌ను రిలీజ్ చేసిన తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ మినిస్ట‌ర్ త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్‌

టాలీవుడ్ యాక్ష‌న్ స్టార్ గోపీచంద్ హీరోగా శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై కె.కె.,రాధామోహ‌న్ నిర్మిస్తోన్న చిత్రం 'పంతం'.

ఆదికి జోడీగా సుర‌భి

'బీరువా', 'ఎక్స్‌ప్రెస్ రాజా', 'జెంటిల్‌మన్' లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న హీరోయిన్ సురభి.