ఈ నెల విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోన్న 'నా నువ్వే'

  • IndiaGlitz, [Friday,May 18 2018]

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా జంట‌గా రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ 'నా నువ్వే'. ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మాణంలో.. జ‌యేంద్ర దర్శ‌క‌త్వంలో కిర‌ణ్ ముప్ప‌వ‌ర‌పు, విజ‌య్ వ‌ట్టికూటి ఈ సినిమాను నిర్మించారు.ఈ నెల గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు మాస్ అండ్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేసిన నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ స‌రికొత్త లుక్‌లో క‌న‌ప‌డుతూ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ చేయ‌డంతో సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ సినిమా అంచ‌నాల‌ను రెట్టింపు చేసింది. ఇప్ప‌టికే ఈ ట్రైల‌ర్‌ను 7.2 మిలియ‌న్ ప్రేక్ష‌కులు వీక్షించారు. ప్ర‌స్తుతం ఈ సినిమా ట్రైల‌ర్ ట్రెండింగ్‌లో ఉంది.

స‌రికొత్త లుక్‌లో క‌న‌ప‌డుతున్న నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, త‌మ‌న్నా మ‌ధ్య కెమిస్ట్రీ.. స్టార్ సినిమాటోగ్రాఫ‌ర్ పి.సి.శ్రీరామ్ అందించిన అమేజింగ్ విజువ‌ల్స్‌.. శ‌ర‌త్ అందించిన మెలోడియ‌స్ ఆల్బమ్ సినిమాకు మేజ‌ర్ ఎసెట్‌గా నిలుస్తున్నాయి. ఆల్‌రెడీ విడుద‌లైన సాంగ్స్‌కు ప్రేక్ష‌కుల నుండి హ్యూజ్ రెస్పాన్స్ వ‌స్తుంది. క‌ల్యాణ్ రామ్‌, త‌మ‌న్నా జోడి ఎలా ఉంటుందోన‌ని అంద‌రూ ముందుగా అనుకున్నారు. అయితే ట్రైల‌ర్ విడుద‌లైన త‌ర్వాత ఈ జోడి హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకుంటార‌ని అంద‌రూ భావిస్తున్నారు.

More News

మరోసారి వాయిదా పడ్డ 'మణికర్ణిక'

విభిన్నమైన కథలతో ఆకట్టుకునే చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు క్రిష్. ప్రస్తుతం వీరనారి ఝాన్సీ లక్ష్మిబాయి జీవితాన్ని ఆధారంగా చేసుకుని 'మణికర్ణిక' సినిమాని తెరకెక్కిస్తున్నారు.

మ‌ళ్ళీ పోటీప‌డుతున్నారు

మరోసారి ఓ యంగ్ హీరోతో ఓ సీనియర్ హీరో పోటీ పడుతున్నారు. గతంలో ఇలా పోటీకి దిగిన సంద‌ర్భంలో విజయం యంగ్ హీరోనే వరించింది.

నిఖిల్ సినిమాలో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి

'కిర్రాక్ పార్టీ' వంటి సక్సెస్ ఫుల్ చిత్రం తర్వాత, నిఖిల్ హీరోగా టీ.యన్.సంతోష్ దర్శకత్వంలో వస్తున్న చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. నిఖిల్ సరసన హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు.

బాలిక విద్య కోసం బన్నీ వాసు ఆర్థిక సహాయం

ప్రముఖ నిర్మాత బన్నీ వాసు మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఆడపిల్లలను చదివించాలని తపనపడే బన్నీ వాసు...

రైతుబంధు పధకం ఫలాన్ని తిరిగి ఇచ్చేసిన హరీష్ శంకర్

కమ్మదనం గ్రామం లో తనకు ఉన్న భూమికి గాను ప్రభుత్వం వారు ఇచ్చిన రైతుబంధు పధకం ఫలాన్ని సినీ దర్శకుడు హరీష్ శంకర్ ఎవరన్నా పేద రైతు సహయార్ధం వాడమని తిరిగి ఇచ్చేసారు.