close
Choose your channels

కరోనాతో బాధపడుతూ.. ధైర్యం చెబుతున్న ‘నా పేరు మీనాక్షి’ ఫేమ్

Thursday, July 2, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కరోనాతో బాధపడుతూ.. ధైర్యం చెబుతున్న ‘నా పేరు మీనాక్షి’ ఫేమ్

కరోనా మహమ్మారి కారణంగా రెండు నెలల పాటు షూటింగ్‌లు నిలిచిపోయాయి. దీంతో కార్మికుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఇటీవల ప్రభుత్వం షూటింగ్‌లకు అనుమతిచ్చింది. అయితే కరోనా కారణంగా మరోమారు షూటింగ్‌లు వాయిదా పడుతున్నాయి. బుల్లితెర నటీనటులు ఒక్కొక్కరుగా కరోనా బారిన పడుతుండటమే దీనికి కారణం. తాజాగా ‘నా పేరు మీనాక్షి’, ‘ఆమె కథ’ హీరోయిన్ నవ్య స్వామి కూడా కరోనా బారిన పడింది. అయితే ఏమాత్రం భయపడకుండా సహనటులకు ఆమె ధైర్యమివ్వడం విశేషం.

తనకు పాజిటివ్ అంటూ వస్తున్న వార్తలపై ఓ వీడియో సందేశం ద్వారా నవ్య స్పందించింది. తనకు కరోనా సోకిన మాట వాస్తవమేనని తెలిపింది. నాలుగు రోజుల నుంచి తలనొప్పితో పాటు అలసటగా ఉండటంతో కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని నవ్య వెల్లడించింది. ఈ విషయాన్ని వెల్లడించడానికి సిగ్గుపడాల్సిన అవసరం కానీ.. భయపడాల్సిన పని కానీ లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం పౌష్టికాహారం తీసుకుంటూ సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నానని తెలిపింది. తనను కాంటాక్ట్ అయిన వారిలో ఎలాంటి అనారోగ్య సమస్యలు కనిపించినా వెంటనే కరోనా టెస్టుకు వెళ్లాలని నవ్య సూచించింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.