సోషల్ మీడియాను దున్నేస్తున్న ‘నాది నక్కిలీసు గొలుసు’..

  • IndiaGlitz, [Thursday,October 01 2020]

‘నాది నక్కిలీసు గొలుసు’ సాంగ్ వినని వారు ఎవరైనా ఉన్నారా? అని ఇప్పుడు అడగటం ఫూలిష్ నెస్ అవుతుందేమో.. అంతగా ఈ సాంగ్ పాపులర్ అయిపోయింది. ఎక్కడ విన్నా ఇదే సాంగ్.. ఎన్నెన్నో వేరియేషన్స్‌లో చేసి ఈ సాంగ్‌పై ఉన్న క్రేజ్‌ను యూత్ ప్రదర్శిస్తోంది. అయితే ఎన్ని వేరియేషన్స్ వచ్చినా అన్నింటినీ ప్రజానీకం ఆదరిస్తూనే ఉంది. ఇటీవలి కాలంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో..’ని ‘నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు’ సాంగ్ కూడా ఇంతే పాపులర్ అయింది. రికార్డులు మీద రికార్డులు కొల్లగొట్టింది. కానీ ఆ సాంగ్‌కు వేరియేషన్స్ అంటూ ఎవరూ పెద్దగా చేయలేదు. కానీ ‘నాది నక్కిలీసు గొలుసు’ సాంగ్‌కు మాత్రం వారానికి ఒకటి.. రెండు వేరియన్స్ వస్తూనే ఉన్నాయి.

కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పలాస 1978’ చిత్రంలోదే ‘నాది నక్కిలీసు గొలుసు’ సాంగ్. రఘు కుంచె సంగీతం అందించడమే కాకుండా ఆయనే స్వయంగా ఆలపించారు. ఈ సాంగ్‌‌కు యూత్‌ ఫిదా అయిపోయారు. ఈ సాంగ్ విడుదల సమయంలో కంటే టిక్‌టాక్ స్టార్ దుర్గారావు ఈ పాటకు డ్యాన్స్ చేయడంతో మరింత పాపులర్ అయిపోయింది. ఈ పాటకు ‘ఢీ’లో ఓ కంటెస్టెంట్ డ్యాన్స్ చేయడమే కాకుండా పాట మధ్యలో దుర్గారావును సైతం తీసుకురావడంతో ఇక ఈ సాంగ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ పాటకు విపరీతంగా వ్యూస్ వచ్చాయి. దీంతో అత్యధిక వ్యూస్ సంపాదించుకున్న పాటగా రికార్డ్‌కెక్కింది.

ఇక అక్కడి నుంచి మొదలు ఈ పాటకు ఎవరికి తోచిన రీతిలో వారు వేరియేషన్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఇటీవల మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె ఇంకా వేరియేషన్స్ వస్తూనే ఉన్నాయంటూ ఆ వీడియోలను ఫేస్‌బుక్‌లో అభిమానులతో పంచుకున్నారు. ఈ పాటకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓ సాంగ్‌కు చేసిన డ్యాన్స్‌ను జోడించి పవన్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనిని చూసిన రఘు కుంచె ఉప్పొంగిపోయారు. తనకు పవన్‌తో పని చేసే అవకాశం ఒకసారి వచ్చిందని.. అది కొందరి కారణంగా చేజారిపోయిందని.. అవకాశం వస్తే సీట్లు సిరిగిపోవాల్సిందేనని రఘు కుంచె పేర్కొన్నారు.

More News

ఇప్పటి వరకూ నమోదైన కేసుల్లో ఒక్క సెప్టెంబర్‌లోనే 40 శాతం కేసులు..

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే.. సెప్టెంబర్ నెలలో కరోనా మరింత తీవ్ర రూపం దాల్చింది.

జ‌యం' ర‌వి, ‘అర‌వింద్‌స్వామి’ ల  'బోగ‌న్‌' ట్రైల‌ర్ విడుద‌ల‌

ఇటీవ‌ల 'బోగ‌న్' చిత్రాన్ని రామ్ తాళ్లూరి తెలుగులో అందిస్తున్నార‌నే ప్ర‌క‌ట‌న రాగానే, ప్రేక్ష‌కుల నుంచి అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించింది.

యాక్షన్‌తో ప్రారంభం కానున్న ‘పుష్ప‌’

స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో ‘ఆర్య‌, ఆర్య 2’ త‌ర్వాత రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప‌’.

ఆసుపత్రిలో కేటీఆర్ తనయుడు.. అసలేం జరిగిందంటే..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

దొంగల హౌస్‌గా మారిన బిగ్‌బాస్ హౌస్.. అంతా రచ్చ రచ్చే..

ఇవాళంతా కిల్లర్ కాయిన్స్ టాస్క్‌తోనే షో మొత్తం నడిచింది. షో స్టార్టింగ్ స్టార్టింగే సొహైల్‌కి అమ్మ రాజశేఖర్‌కు మధ్య రచ్చ.