‘నాంది’ ట్రైలర్: నా జీవితం ఇప్పుడే మొదలైంది..

  • IndiaGlitz, [Saturday,February 06 2021]

అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నాంది’. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, ప్రియదర్శి, హరీష్ ఉత్తమన్, ప్రవీణ్, నవమి, వినయ్ వర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ శనివారం విడుదలైంది. ఒక అమాయకుడైన వ్యక్తికి అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా రాటు దేలాడు. పరిస్థితుల్ని ఎలా ఎదుర్కొన్నాడనే కథతో సినిమా తెరకెక్కినట్టు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది.

‘రాజగోపాల్ గారిని నేను మర్డర్ చేయడం ఏంటి సార్’ అనే అల్లరి నరేష్ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ఆ తరువాత చెయ్యని నేరాన్ని నరేష్‌పై వేసి జైలుకు పంపించడం.. ఆయన తరుఫున లాయర్‌గా వరలక్ష్మి శరత్ కుమార్ స్ట్రాంగ్‌గా వాదించడం.. జైలులో అల్లరి నరేష్‌పై అటాక్ చేయడం.. ఈ పరిస్థితులన్నింటిని ఎదుర్కొంటూ హీరో స్ట్రాంగ్‌ అయిపోవడం.. తరువాత తను ఆ పరిస్థితులను ఎదుర్కొంటూ బయటపడటం వంటి అంశాలతో ఈ ట్రైలర్‌ను మేకర్స్ కట్ చేశారు.

‘అందరూ నా జీవితం ఇక్కడితో అయిపోయిందనుకుంటున్నారు.. కాదు ఇప్పుడే మొదలైంది’ అని అల్లరి నరేష్ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ముగుస్తుంది. సతీష్ వేగ్నేశ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ కెరీర్‌లోనే ఇటువంటి చిత్రాన్ని చేయడం అరుదు. ట్రైలర్‌ను బట్టి చూస్తే ఈ సినిమా అల్లరి నరేష్‌కు మంచి సక్సెస్‌ను అందిస్తుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 19న విడుదల కానుందని ట్రైలర్‌ ద్వారా చిత్ర యూనిట్ ప్రకటించింది.

More News

రాజశేఖర్ 92ను ప్రకటించేశారు..

హీరో రాజశేఖర్ కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న అనంతరం వరుసగా సినిమాలను ప్రకటిస్తూ వస్తున్నారు.

భార్యను చంపి అద్భుతమైన స్క్రీన్‌ప్లే నడిపాడు.. కానీ కథ అడ్డం తిరిగింది

పెళ్లయిన రెండు నెలలకే భార్యను హతమార్చి తన పైకి కేసు రాకుండా పెద్ద స్కెచ్చే వేశాడు. సినిమా రేంజ్‌లో స్క్రీన్‌ప్లే నడిపాడు.

పవన్ టైటిల్ ఫిక్స్.. ఇక అధికారిక ప్రకటనే తరువాయి..!

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అసెంబ్లీ ఎన్నికల్లోగా వీలైనన్ని సినిమాలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న విషయం తెలిసిందే.

థియేటర్స్‌ యాజమాన్యాలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

థియేటర్స్‌ యాజమాన్యాలకు తెలంగాణ గవర్నమెంట్ గుడ్ న్యూస్ అందించింది. కరోనా వైరస్ లాక్ డౌన్ రూల్స్ సడలింపుల్లో భాగంగా ఈ నెల ఒకటో తేదీ

రాజ‘శేఖర్’ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..

చాలా కాలం పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన హీరో రాజశేఖర్ 2017లో ఎంట్రీ ఇచ్చి ‘గరుడవేగ, కల్కి’ వంటి సినిమాలతో మరోమారు తన స్టామినాను రుజువు చేసిన విషయం తెలిసిందే.