పోలవరం ప్రాజెక్ట్‌ ఎత్తు తగ్గించారా.. లేదా, ఆ సంతకాలు ఎందుకు చేశారు: జగన్‌‌పై నాదెండ్ల ప్రశ్నల వర్షం

  • IndiaGlitz, [Tuesday,June 06 2023]

పోలవరం ప్రాజెక్ట్ జగన్ పాపపు పథకంగా మారిందన్నారు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. సోమవారం ఆయన గుంటూరులో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించిందన్నారు. దీనికి ఆమోదం తెలుపుతూ రెండు సంతకాలు చేసిందని.. తాము గతంలోనే చెప్పామని నాదెండ్ల గుర్తుచేశారు. ఇప్పుడు తాజాగా కేంద్రం ప్రకటనతో ఈ విషయం స్పష్టమైందని మనోహర్ అన్నారు. దీనిపై సీఎం జగన్, మంత్రి అంబటి రాంబాబులు వివరణ ఇవ్వాలని నాదెండ్ల డిమాండ్ చేశారు.

వాస్తవాలను దాచేలా అంబటి ప్రెస్‌మీట్:

పోలవరం ప్రాజెక్ట్‌కు రూ.17,144 కోట్ల నిధులు ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించిందని.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని మనోహర్ దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి జగన్ పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించనున్న నేపథ్యంలో ప్రజలకు వాస్తవాలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పోలవరంపై జగన్ మీడియా సమక్షంలో సమీక్ష చేపట్టాలని మనోహర్ డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌ను అటకెక్కించారని, ఇరిగేషన్ శాఖ మంత్రి ప్రజలకు వాస్తవాలు తెలియకుండా వుండేలా హడావుడిగా ప్రెస్ మీట్‌‌లను పెడుతున్నారని మనోహర్ ఆరోపించారు.

ఇప్పుడు ఉన్నపళంగా పోలవరానికి ఎందుకు:

2021లో పోలవరం ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేస్తామని చెప్పిన జగన్ ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారని నాదెండ్ల ఆరోపించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉన్నపళంగా జగన్ పోలవరం పర్యటనకు ఎందుకు వెళ్తున్నారని ఆయన ప్రశ్నించారు. 14 వేల మంది పోలవరం నిర్వాసితులకు ఎలాంటి పరిహారం అందిస్తారని నాదెండ్ల నిలదీశారు. రిటైనింగ్ వాల్ డ్యామేజీకి కారణం అవినీతా, నాణ్యతా లోపమా అనేది చెప్పాలని ఆయన కోరారు.

More News

పవన్ కల్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన నాదెండ్ల.. రూట్ మ్యాప్ ఇది, ప్రతి చోటా జనవాణి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజలతో మమేకం కానున్నారు. దీనిలో భాగంగా ఈ నెల 14 నుంచి ఆయన వారాహి

వట్టిచెరుకూరు ట్రాక్టర్ ప్రమాదం.. గుంటూరు జీజీహెచ్‌లో క్షతగాత్రులను పరామర్శించిన నాదెండ్ల మనోహర్

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో ట్రాక్టర్ బోల్తా పడి ఏడుగురు మరణించిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. 20 మంది వరకు గాయపడ్డారు.

జనసేన ఆస్ట్రేలియా సహ సమన్వయకర్తలు వీరే .. నాగబాబు కీలక ప్రకటన

పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి తెలుగు రాష్ట్రాల్లో బలమైన కేడర్ వున్న సంగతి తెలిసిందే. అలాగే వివిధ దేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐలు సైతం పవన్ భావజలాన్ని, ప్రణాళికలను

Janasena: అనుకోని ప్రమాదాలు.. రోడ్డునపడ్డ జనసైనికుల కుటుంబాలు: నేనున్నానంటూ పవన్, బీమా అందజేసిన నాదెండ్ల

ప్రజలకు ఏదో ఒకటి చేయాలని, సమాజంలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో జనసేన పార్టీని స్థాపించారు పవన్ కల్యాణ్. 2014లో పార్టీ పెట్టిన నాటి నుంచి నేటి వరకు ఆయన తన కష్టాన్నే నమ్ముకుని ముందుకు వెళ్తున్నారు.

శ్రీకాంత్ కూతురిని చూశారా.. ఆ అందం ముందు హీరోయిన్లు కూడా దిగదుడుపే

టాలీవుడ్‌లో వున్న విలక్షణ నటుల్లో శ్రీకాంత్ ఒకరు. విలన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆయన హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకులను మెప్పించారు. లవ్, రోమాంటిక్, ఫ్యామిలీ డ్రామా, జానపదం, పౌరాణికం,