Nadendla Manohar:పవన్ వారాహి యాత్రను విజయవంతం చేయండి : జనసేన కేడర్‌కు నాదెండ్ల మనోహర్ పిలుపు

  • IndiaGlitz, [Thursday,June 08 2023]

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించనున్న వారాహి యాత్రను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను కోరారు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. బుధవారం గుంటూరు జిల్లాలోని వేమూరు నియోజకవర్గం కొల్లూరు గ్రామానికి చెందిన జనసేన నేతలతో ఆయన ముచ్చటించి, స్థానిక సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా రహదారుల దుస్థితి, జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల లేమి, లబ్దిదారులు ఇక్కట్లు, గిట్టుబాటు ధర లేక రైతులు పడుతున్న అవస్థలను కొల్లూరు మండల జనసేన నాయకులు మనోహర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన నాదెండ్ల గ్రామ కమిటీల నియామక ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు.

కాగా.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజలతో మమేకం కానున్నారు. దీనిలో భాగంగా ఈ నెల 14 నుంచి ఆయన వారాహి యాత్రను ప్రారంభించనున్నారు. ఈ మేరకు వారాహి యాత్ర పోస్టర్‌ను నాదెండ్ల మనోహర్ సోమవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. దీనితో పాటు రూట్ మ్యాప్, యాత్రలో పర్యటించనున్న జనసేన అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కర్తలను ఆయన ప్రకటించారు.

అన్నవరంలో పవన్ ప్రత్యేక పూజలు :

ఈ నెల 14న అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం కత్తిపూడి జంక్షన్ మీదుగా పవన్ కల్యాణ్ వారాహి యాత్రను ప్రారంభించనున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్తిపాడు , పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, ముమ్మిడివరం, అమలాపురం, పి గన్నవరం, రాజోలు మీదుగా .. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు, నర్సాపురం, భీమవరంలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కొనసాగుతోందని నాదెండ్ల తెలిపారు.

ప్రతి నియోజకవర్గంలో జనవాణి :

వారాహి యాత్ర సాగే ప్రతి నియోజకవర్గంలో జనవాణి కార్యక్రమాలు నిర్వహిస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ యాత్రలో అన్ని వర్గాల ప్రజలను పవన్ కలిసేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశామని.. ఒక్కో నియోజకవర్గంలో రెండు రోజుల పాటు వారాహి యాత్ర కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రతిరోజూ ఉదయం తాను బస చేసిన ప్రాంతంలోని స్థానిక సమస్యలపై పవన్ కల్యాణ్ జనవాణి కార్యక్రమం నిర్వహిస్తారని నాదెండ్ల మనోహర్ చెప్పారు.

More News

Namrata: బేబీ షవర్ పార్టీకి మహేశ్ దంపతులు.. నమ్రత ధరించిన కుర్తా ధర ఎంతో తెలుసా..?

టాలీవుడ్ స్టార్ కపుల్ మహేశ్ - నమ్రతల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె భార్యగా వచ్చాక మహేశ్ జీవితంలో

Om Raut: శ్రీవారి ఆలయం ముందే కిస్సులు, హగ్గులు: వివాదంలో ఓం రౌత్, కృతి సనన్‌

ఆదిపురుష్ టీమ్ వివాదంలో చిక్కుకుంది. ఏకంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్న తిరుమలలో చిత్ర యూనిట్‌లోని

EAMCET Web Counselling: వెబ్ కౌన్సెలింగ్‌లలో ఆప్షన్లు ఎలా నమోదు చేసుకోవాలి...ఈ ఎడ్యుకేషన్ సమ్మిట్ మీ కోసమే

విద్యార్ధుల జీవితాల్లో ఇంటర్, డిగ్రీలు కీలకమైన దశలు. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు,

ఆదిపురుష్ ఫైనల్ ట్రైలర్ : నా ఆగమనం .. అధర్మ విద్వంసం .. క్లాసిక్‌లో యాక్షన్ టచ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘‘ఆదిపురుష్’’. భారతీయుల ఇతిహాసం రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా

YS Jagan: ఇది జగన్ దక్షత : పోలవరం పనుల కదలిక వెనుక అంతా తానై .. సాకారం కానున్న 100 ఏళ్ల స్వప్నం

పోలవరం ప్రాజెక్ట్.. ఆంధ్రప్రదేశ్ జీవనాడి. ఉరకలెత్తే గోదావరి వృధాగా సముద్రం పాలవుతూ వుండటంతో ఆ నదీ జలాలను ఒడిసిపట్టుకోవాలని బ్రిటీష్ ప్రభుత్వం