నాగ అన్వేష్ 'ఏ నిమిషానికి ఏమి జరుగునో' ప్రారంభోత్సవం

  • IndiaGlitz, [Saturday,March 03 2018]

పుష్పకవిమానం, ఆదిత్య 369 వంటి ప్రయోగాత్మక చిత్రాల కోవలో మరో వినూత్న చిత్రం షో టైం స్టూడియో సమర్పించు గణేష్ క్రియేషన్స్ సంస్థ నుంచి నాలుగవ ప్రొడక్షన్ గా ఏ నిమిషానికి ఏమి జరుగునో అనే చిత్రం రాబోతోంది. నాగ అన్వేష్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం నేడు (మార్చి 3) హద్రాబాద్ లో జరిగింది.

ఈ సందర్భంగా నిర్మాత లండన్ గణేష్ మాట్లాడుతూ... "మా బ్యానర్ లో ఇదివరకు మొదటి ప్రొడక్షన్ ఓపెనింగ్ స్వర్గీయ రామానాయుడి గారి చేతుల మీదుగా జరిగింది. ఇప్పుడు నాలుగవ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. నేను లండన్ లో ఉండటం మూలాన లండన్ అనేది ఇంటిపేరుగా మారిపోయింది. ఇక సినిమా విషయానికి వస్తే 'ఏ నిమిషానికి ఏమి జరుగునో' అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో యంగ్ అండ్ డైనమిక్ హీరో నాగ అశ్విన్ హీరోగా, నా స్నేహితుడు నాగేశ్వర రావు సహకారంతో నిర్మించడం జరుగుతోంది. తప్పకుండా ప్రేక్షకాదరణ పొందే చిత్రం అవుతుందని భావిస్తున్నా" అన్నారు.

మరో నిర్మాత వి.నాగేశ్వర రావు మాట్లాడుతూ.. "మంచి కథ అవడంతోనే నేను భాగస్వామిని అయ్యాను. ఫారిన్, సిటీ, ఫారెస్ట్ ఇలా 3 షెడ్యూల్ లో షూటింగ్ ఉంటుంది. కొత్త కథ కనుక ఆడియన్స్ కు నచ్చి తీరుతుందని ఆశిస్తున్నా" అన్నారు.

హీరో నాగ అశ్విన్ మాట్లాడుతూ.. "చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్.. టైటిల్ కు తగ్గట్టుగానే ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో అనే విదంగానే ఉంటుంది ప్రతి సన్నివేశం. టాలీవుడ్ లొనే డిఫరెంట్ సబ్జెక్టుగా నిలుస్తుందని, అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను" అన్నారు.

దర్శకుడు శ్రీ కృష్ణ గొర్లె మాట్లాడుతూ.. "సైన్క్ ఫిక్షన్ మూవీగా ఈ చిత్రం తెరకెక్కనుంది. మూడు షెడ్యూల్స్ లో షూటింగ్ పూర్తి చేస్తాము. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. మా సినిమా ప్రారంభోత్సవానికి విచ్చేసి తమ అమూల్యమైన ఆశీర్వచనాలు అందించిన వి వి వినాయక్, సాగర్, మరియు రమణ గారికి నా కృతజ్ఞతలు" అన్నారు.

ఈ నూతన చిత్రానికి హీరో నాగ అన్వేష్ కాగా ఓ ప్రముఖ హీరోయిన్ నటించనుంది.. డీఓపీ: భాస్కర్ సమల, నిర్మాతలు: లండన్ గణేష్, సి హెచ్. వి. నాగేశ్వరరావు, కథ-మాటలు- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: శ్రీ కృష్ణ గొర్లె.

More News

కార్తీ డైరెక్టర్ తో అజిత్ చిత్రం?

తెలుగు చిత్రాలతో కెరీర్ ను ప్రారంభించి..తమిళనాట స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు అజిత్.

ఎంబీఏ స్టూడెంట్ గా నాగశౌర్య

'ఛలో' తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యువ కథానాయకుడు నాగశౌర్య..

మార్చి 18న 'సవ్యసాచి' ఫస్ట్ లుక్ , జూన్ 14న సినిమా రిలీజ్

'ప్రేమమ్ ' లాంటి సూపర్ సక్సెస్ అనంతరం అక్కినేని నాగచైతన్య, చందు మొండేటిల క్రేజీ కాంబినేషన్ లో

ఈరోజు 'కణం' రెండో పాట 'జో లాలి జో' విడుదల

నాగశౌర్య,సాయిపల్లవి జంటగా ఎన్.వి.ఆర్.సినిమా సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ పతాకంపై విజయ్ దర్శకత్వంలో

థియేటర్స్ బంద్ కు సహకరిస్తోన్న ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు - టిఎఫ్ సిసి ఛైర్మన్

డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల తీరును నిరసిస్తూ శుక్రవారం నుండి ఐదు రాష్ట్రాల నిర్మాతల మండలి సంయుక్తంగా థియేటర్ల బంద్