'ది ఘోస్ట్' సెప్టెంబర్ 25న కర్నూలులో జరిగే  ప్రీ-రిలీజ్ కి హాజరుకానున్న నాగ చైతన్య, అఖిల్

  • IndiaGlitz, [Friday,September 23 2022]

కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుల భారీ అంచనాల యాక్షన్ థ్రిల్లర్' ది ఘోస్ట్' ప్రీ-రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 25న కర్నూలులోని ఎస్టీబిసి గ్రౌండ్‌లో గ్రాండ్ గా జరగనుంది. ఓపెన్ గ్రౌండ్ లో జరగబోతున్న ఈ పబ్లిక్ ఈవెంట్ కి ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. టీమ్ మొత్తం ఈ వేడుకను ఘనంగా నిర్వహించనుంది. ఈ వేడుకని మరింత ప్రత్యేకంగా చేయడానికి నాగ చైతన్య, అఖిల్ ఈ గ్రాండ్ ఈవెంట్ కి హాజరుకానున్నారు. చాలా కాలం తర్వాత స్టార్ తండ్రీ కొడుకులు కలిసి సినిమా వేడుకకి రావడం అక్కినేని అభిమానులకు కన్నుల పండుగ కానుంది.

'ది ఘోస్ట్' టీమ్ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లతో అలరిస్తోంది. నిన్న నాగార్జున, సోనాల్ చౌహాన్ ఇంటెన్స్ ట్రైనింగ్ చూపించే వీడియో- గన్స్, స్వోర్డ్స్‌ని విడుదల చేసారు. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.

భరత్‌, సౌరబ్‌ ద్వయం ఈ సినిమా పాటలని స్కోర్ చేస్తున్నారు. ముఖేష్ జి సినిమాటోగ్రఫర్ గా, బ్రహ్మకడలి ఆర్ట్ డైరెక్టర్ గా, దినేష్ సుబ్బరాయన్, కేచ్ స్టంట్ మాస్టర్స్ గా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. ఈ చిత్రంలో గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్‌లు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలోకి రానుంది.

తారాగణం: నాగార్జున, సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ తదితరులు

More News

'శాకుంతలం' నవంబర్ 4న విడుదల

ప్రపంచం నలుమూలలున్న పండితుల ప్రశంసలు పొందిన సంస్కృత‌ నాటకం అభిజ్ఞాన శాకుంతలం.

BiggBoss: ‘‘పిట్ట’’ అంటూ కామెంట్.. ఇనయా- శ్రీహాన్‌ల గొడవతో దద్దరిల్లిన హౌస్

కెప్టెన్సీ కంటెండెర్స్ కోసం జరుగుతోన్న అడవిలో ఆట టాస్క్.. ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతోంది.

Geeta Sakshigaa: ప్రేక్షకులలలో క్యూరియాసిటీతో పాటు హైప్ పెంచిన "గీతా సాక్షిగా" టీజర్

PUSHPAK మరియు JBHRNKL సమర్పణలో చేతన్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై ఆదర్శ్, చిత్ర శుక్లా, రూపేష్ శెట్టి, శ్రీకాంత్ అయ్యంగార్,

NTR Health University : పేరు మారిస్తే వైఎస్ స్థాయి పెరగదు.. ఎన్టీఆర్ స్థాయి తగ్గదు : హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై జూ. ఎన్టీఆర్

విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరు మార్పు వ్యవహారం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కలకలం రేపుతోంది.

Ind vs Aus T20 : మ్యాచ్ టికెట్ల కోసం ఎగబడ్డ అభిమానులు, జింఖానా గ్రౌండ్‌లో అభిమానులు, పోలీసులకు గాయాలు

ఈ నెల 25న హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న భారత్ - ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్‌కు