బాలీవుడ్‌కి డేట్స్ కేటాయించిన చైత‌న్య‌..?

  • IndiaGlitz, [Monday,March 15 2021]

మన టాలీవుడ్ స్టార్స్ క్ర‌మంగా బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకునే ప‌నిలో ప‌డ్డారు. కొంద‌రు పాన్ ఇండియా సినిమాల‌తో మెప్పించాల‌నుకుంటుంటే, మ‌రికొంద‌రు బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి త‌మ‌దైన గుర్తింపు తెచ్చుకోవాల‌నుకుంటున్నారు. ఈ రెండో కేట‌గిరిలో చేరుతున్నాడు మ‌రో టాలీవుడ్ హీరో.. ఆయ‌నెవ‌రో కాదు, అక్కినేని నాగ‌చైత‌న్య‌. ఈ హీరో బాలీవుడ్ సూప‌ర్‌స్టార్స్‌లో ఒక‌రైన ఆమిర్‌ఖాన్ టైటిల్‌పాత్ర‌లో న‌టిస్తోన్న లాల్ సింగ్ చ‌ద్దాలో న‌టించ‌బోతున్నాడు. మే నెల నుంచి ఈ సినిమా కోసం డేట్స్‌ను కేటాయించాడ‌ట నాగ‌చైత‌న్య‌. అది కూడా వారం, ప‌దిరోజు కాదు.. ఏకంగా నెల‌రోజులు. మ‌రీ బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను నాగ‌చైత‌న్య త‌న న‌ట‌న‌తో ఎలా మెప్పిస్తాడ‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. అస‌లు నాగ‌చైత‌న్య పాత్ర ఎలా ఉండ‌బోతుందోన‌ని కూడా అంద‌రిలో క్యూరియాసిటీ నెల‌కొంది.

నిజానికి ఈ పాత్ర‌లో మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి చేయాల్సింది. కానీ.. ఎందుక‌నో విజ‌య్ సేతుప‌తి చివ‌రి నిమిషంలో డ్రాప్ అయ్యాడు. ఆయ‌న స్థానంలో చైత‌న్య వ‌చ్చి చేరాడు. ఆమిర్‌ఖాన్‌, క‌రీనా క‌పూర్ న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని అద్వైత్ చంద‌న్ తెర‌కెక్కిస్తున్నాడు. హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ సినిమా రీమేక్ ఇది. ఈ ఏడాది డిసెంబ‌ర్ 24న విడుద‌ల కానుంది.

More News

సందీప్ కిష‌న్ సినిమా పేరు మారుతోంది.. కార‌ణం ఇదేనా?

యువ క‌థానాయ‌కుడు సందీప్ కిష‌న్ హీరోగా జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రానికి ‘రౌడీ బేబీ’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేసిన సంగ‌తి తెలిసిందే. సినిమా సెట్స్‌కు వెళ్ల‌డానికి ముందే ఈ టైటిల్‌ను

'రంగ్ దే' చిత్రం నుంచి మరో గీతం విడుదల

యూత్ స్టార్‘నితిన్, కీర్తి సురేష్‘ ల'రంగ్ దే' చిత్ర లోని మరో గీతం ఈరోజు విడుదల అయింది. కథానుసారం చిత్ర కథా నాయకుడు పరిచయ గీతం గా కనిపించే, వినిపించే ఈ సందర్భోచిత గీతం వివరాల్లోకి వెళితే

తెలంగాణ హోంమంత్రి ఓటు చెల్లనట్టేనా?

తెలంగాణలో పట్టభద్రుల స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. అయితే ఈ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్న

నాన్ వెజ్ పిజ్జా ఇస్తావా?.. రూ.కోటి కట్టాలంటూ కోర్టుకెక్కిన మహిళ

ఈ రోజుల్లో సంప్రదాయం.. చట్టుబండలంటూ పెద్దగా ఎవరూ మడిగట్టుకుని కూర్చోవట్లేదు. శుబ్బరంగా దొరికిన కాడికి వెజ్జా.. నాన్ వెజ్జా అనేది చూసుకోకుండా లాగించేస్తున్నారు.

'కేజీఎఫ్‌' హీరో యశ్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు

‘కేజీఎఫ్‌’ ఫేమ్‌.. హీరో యశ్‌పై రాజ్య రైతు సంఘం కార్యాధ్యక్షుడు అణ్ణాజప్ప హాసన్‌ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. యశ్‌ తల్లిదండ్రులు ఇటీవల దుద్ధ హోబళి తిమ్మాపుర గ్రామంలో కొనుగోలు చేసిన భూమిలో