రామ్ జతగా చైతు హీరోయిన్
Send us your feedback to audioarticles@vaarta.com
గత ఏడాది `శైలజారెడ్డి అల్లుడు`లో నాగచైతన్య జతగా నటించిన అను ఇమ్మాన్యుయేల్ను ఇప్పుడు పూరి జగన్నాథ్, రామ్ కాంబినేషన్లో రూపొందుతోన్న `ఇస్మార్ట్ శంకర్` సినిమాలో హీరోయిన్గా నటింప చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈమెతో పాటు మరో ఇద్దరు.. ముగ్గురు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
జనవరి చివరి వారంలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను మే నెలలో విడుదల చేస్తామని పూరి ప్రకటించేశారు కూడా. ఎప్పటిలాగానే పూరి మాస్ స్టైల్లో రామ్ను తెరపై చూపించనున్నారు. పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.