సాహసం శ్వాసగా సాగిపో రిలీజ్ ఎప్పుడో చెప్పిన చైతన్య..!

  • IndiaGlitz, [Thursday,October 06 2016]

అక్కినేని నాగ చైత‌న్య న‌టించిన తాజా చిత్రం ప్రేమ‌మ్. ఈ చిత్రాన్ని చందు మొండేటి తెర‌కెక్కించారు. సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీగా రూపొందిన ప్రేమ‌మ్ ద‌స‌రా కానుక‌గా ఈనెల 7న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అయితే...ఈ సినిమా క‌న్నా ముందు చైత‌న్య న‌టించిన సాహ‌సం శ్వాస‌గా సాగిపో రిలీజ్ కావాలి. కానీ...కొన్ని కార‌ణాల వ‌ల‌న సాహ‌సం శ్వాస‌గా సాగిపో ఇప్ప‌టి వ‌ర‌కు రిలీజ్ కాలేదు. అలాగే ప్రేమ‌మ్, సాహ‌సం శ్వాస‌గా సాగిపో చిత్రాల‌ను ఒకేరోజున రిలీజ్ చేయ‌నున్న‌ట్టు గ‌తంలో ప్ర‌క‌టించారు. ఆత‌ర్వాత రిలీజ్ డేట్స్ మార్చారన్న విష‌యం తెలిసిందే.
అస‌లు ఎందుకిలా జ‌రిగింది అని చైత‌న్య‌ను అడిగితే...నా రెండు సినిమాల‌ను ఒకేసారి రిలీజ్ చేయ‌కూడ‌దు అలా చేస్తే రెండు సినిమాల‌కు న‌ష్టం క‌లుగుతుంది. అందుకే ఒకేరోజున రెండు సినిమాల‌ను రిలీజ్ కాకుండా చూసాను. ఇక ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే...తెలుగు వెర్షెన్ అంతా రెడీగా ఉంది. త‌మిళ్ వెర్షెన్ కొంచెం షూటింగ్ పార్ట్ బ్యాలెన్స్ ఉంది.త్వ‌ర‌లో షూటింగ్ పూర్తి చేసి తెలుగు, త‌మిళ్ లో ఒకేసారి రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. ప్రేమ‌మ్ రిలీజ్ అయిన మూడు వారాల‌కు సాహ‌సం శ్వాస‌గా సాగిపో రిలీజ్ చేయాల‌నుకుంటున్నాం అని తెలియ‌చేసారు చైతు..!

More News

పవన్ చిత్రంలో సునీల్....?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాల నుండి చిన్న బ్రేక్ తీసుకుని వరుస సినిమాలు చేస్తున్నాడు.

వంశీకి ఫైన‌ల్ గా ఫ్యాష‌న్ డిజైన‌ర్ దొరికాడు..!

గోదావరి అందాలను అత్యంత అద్భుతంగా  తెరకెక్కించి... తెలుగు తెరపై తనదైన ముద్ర వేసిన క్రియేటివ్‌ డైరెక్టర్‌ వంశీ. మాస్ రాజా ర‌వితేజ హీరోగా  వంశీ లేడీస్ టైల‌ర్ చిత్రానికి సీక్వెల్ గా ఫ్యాష‌న్ డిజైన‌ర్ స‌న్నాఫ్ లేడీస్ టైల‌ర్ అనే చిత్రాన్ని రూపొందించాలి అనుకున్నారు.

అప్పుడే బాల‌య్య రెడీ అవుతున్నాడు...

గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి షూటింగ్ లో బిజీగా ఉన్న నంద‌మూరి బాల‌కృష్ణ...గౌత‌మిపుత్ర‌శాత‌క‌ర్ణి 100వ చిత్రం కావ‌డంతో అభిమానులు, ప్రేక్ష‌కులు సినిమాపై చాలా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

100% కొత్త‌గా ఉండే లాఫింగ్ ఫీస్ట్ విత్ ట్విస్ట్ ఈడు గోల్డ్ ఎహే - డైరెక్ట‌ర్ వీరు పోట్ల‌

వ‌ర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రాల‌కు ర‌చ‌యిత‌గా వ‌ర్క్ చేసి...బిందాస్ సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారి తొలి ప్ర‌య‌త్నంలోనే స‌క్సెస్ సాధించిన రైట‌ర్ ట‌ర్న‌డ్ డైరెక్ట‌ర్ వీరు పోట్ల‌. ఆత‌ర్వాత ర‌గ‌డ‌, దూసుకెళ్తా చిత్రాల‌తో వ‌రుస విజ‌యాలు సాధించిన వీరు పోట్ల తాజాగా తెర‌కెక్కించిన చిత్రం ఈడు గోల్డ్ ఎహే.

'దేశవాళి వినోదం' పంచే 'జయమ్ము నిశ్చయమ్మురా' సమైక్యంగా నవ్వుకుందాం రండి!

క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన సినిమాలను-సకుటుంబ సమేతంగా చూసి ఆనందించదగ్గ సినిమాలుగా పేర్కొంటుంటారు.