'చస్తే చద్దాం.. కానీ తేల్చుకుని చద్దాం'...  భావోద్వేగాల మేళవింపుగా లవ్‌స్టోరీ, ఆకట్టుకున్న ట్రైలర్

  • IndiaGlitz, [Monday,September 13 2021]

దర్శకుడు శేఖర్ కమ్ముల అంటేనే భావోద్వేగాల మేళవింపు. క్లాస్ టచ్‌తో సెల్యూలాయిడ్‌పై అందమైన పెయింటింగ్‌లా వుంటాయి శేఖర్ సినిమాలు. ఫిదా సినిమాతో అన్ని వర్గాలను కట్టి పడేసిన ఆయన ఇప్పుడు ‘‘లవ్ స్టోరీ’’ సినిమాతో మళ్లీ తన మార్కు మ్యాజిక్ ను చూపించబోతున్నారు. నాగచైతన్య-సాయి పల్లవి కాంబినేషన్ లో తెరకెక్కిన లవ్ స్టోరీ ఈ నెల 24న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

ట్రైలర్ లో సినిమా వన్ లైన్ ఆర్డర్ మొత్తం చెప్పేసారు. డ్యాన్స్ స్టూడియో పెట్టాలనే కుర్రాడు, సాఫ్ట్ వేర్ ఇంజీనీర్ కావాలనుకునే అమ్మాయి, ఇద్దరూ ప్రేమలో పడడం, ఇళ్లలో అభ్యంతరాలు, ప్రేమ జంట జంప్, వారి వెనుక పరుగులు...ఇలా ఒక ముక్కలో కథ ఏంటనే దానిని ట్రైలర్ లోనే చెప్పేసారు. ఫ్యామిలీ ఏమోషన్స్, రొమాన్స్ ఇలా అన్ని అంశాలని శేఖర్ కమ్ముల పర్ఫెక్ట్ గా మిక్స్ చేసినట్లు ఉన్నారు. ట్రైలర్ చివర్లో 'చస్తే చద్దాం.. కానీ తేల్చుకుని చద్దాం' అంటూ నాగ చైతన్య చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది.

ఇప్పటికే ఈ సినిమా పాటలు పెద్ద హిట్ అయ్యాయి. ముఖ్యంగా ‘‘సారంగ దరియా’’ కుర్రకారును ఊపేస్తోంది. చాలా రోజుల క్రితమే విడుదల కావాల్సిన లవ్ స్టోరీ చిత్రం కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టినా పరిస్థితులు అనుకూలించక నిర్మాతలు ఈ చిత్రాన్ని వాయిదా వేశారు.

More News

రోడ్డుపై పడివున్న సాయి తేజ్‌.. కాపాడింది ఇతనే: మంచినీళ్లు తాగించి, అంబులెన్స్‌కు ఫోన్

సినీ నటుడు సాయిధరమ్ తేజ్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయనను ఆసుపత్రికి తరలించడం..

సాయిధరమ్ తేజ్‌కు విజయవంతంగా కాలర్ బోన్ సర్జరీ... 24 గంటలు అబ్జర్వేషన్‌లోనే

రోడ్డు ప్రమాదానికి గురైన సినీ నటుడు సాయిధరమ్‌ తేజ్‌ గత మూడు రోజుల నుంచి జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

‘సీటీమార్’ సినిమా తీసినందుకు ద‌ర్శ‌కుడిగా ప్రౌడ్‌గా, హ్యాపీగా ఫీల్ అవుతున్నాను: డైరెక్ట‌ర్ సంప‌త్ నంది

ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో

‘భళా తందనాన’ లో హీరోయిన్ కేథరిన్ థ్రెసా ఫస్ట్ లుక్ విడుద‌ల‌

శ్రీ విష్ణు, కేథ‌రిన్ థ్రెసా కాంబినేషన్‌లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న చిత్రం `భళా తందనాన` .

'ఖిలాడి' ఫస్ట్ సింగిల్ రిలీజ్‌

మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ `ఖిలాడి` షూటింగ్ ముగింపు దశలో ఉంది.