శైల‌జా రెడ్డి అల్లుడు ఎప్పుడంటే..

  • IndiaGlitz, [Friday,June 08 2018]

మ‌హానుభావుడు వంటి ఘ‌న‌విజ‌యం త‌రువాత మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం శైల‌జారెడ్డి అల్లుడు (ప్ర‌చారంలో ఉన్న పేరు). నాగ‌చైత‌న్య, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా న‌టిస్తున్న ఈ సినిమాలో ర‌మ్య‌కృష్ణ ఓ కీల‌క పాత్ర పోషిస్తోంది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సూర్య దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపీసుంద‌ర్ సంగీత‌మందిస్తున్నారు. ఫ‌స్టాఫ్‌కు సంబంధించిన షూటింగ్ మొత్తం ఇప్ప‌టికే పూర్తిచేసుకున్న ఈ సినిమా.. ప్ర‌స్తుతం సెకండాఫ్‌కు సంబంధించిన షూటింగ్‌ను జ‌రుపుకుంటోంది.

కాగా.. ఈ సినిమాకి సంబంధించిన తాజా షెడ్యూల్ ఈ నెల 18 నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో జ‌రుగనుంది. 15 రోజుల పాటు జ‌రిగే షెడ్యూల్‌లో కొన్ని కీల‌క‌మైన స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నున్నారు. ఈ షెడ్యూల్‌లో ర‌మ్య‌కృష్ణ‌పై కొన్ని ముఖ్య‌మైన స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌బోతున్నార‌ని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాని ఆగ‌స్టు చివ‌రి వారంలో విడుద‌ల చేయ‌డానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.

More News

దిల్ రాజు.. నాలుగోసారి

ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజుకు క‌లిసొచ్చిన సీజ‌న్ వేస‌వి. ఈ సీజ‌న్‌లో రిలీజ్ చేసిన చాలా సినిమాలు రాజుకు మంచి విజ‌యం అందించాయి.

'స‌మ్మోహ‌నం' సెన్సార్ పూర్తి!

అనూహ్య‌మైన క‌థాంశంతో ఆద్యంతం వినోదాత్మ‌కంగా తెర‌కెక్కిన 'స‌మ్మోహ‌నం' సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది.

శ‌ర్వానంద్ రిపీట్ చేస్తాడా?

కంటెంట్ బేస్డ్ మూవీస్‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్న యువ క‌థానాయ‌కుడు శ‌ర్వానంద్‌. ఈ యంగ్ హీరో సంక్రాంతి, ద‌స‌రా సీజ‌న్‌లో సంద‌డి చేసిన చిత్రాలు మంచి విజ‌యం సాధించాయి.

సెకండాఫ్ నాగ్ ఫ్యామిలీదే..

ఈ ఏడాది ఫ‌స్టాఫ్‌లో అక్కినేని ఫ్యామిలీకి చెందిన  హీరోల‌ నుంచి ఒక సినిమా  మాత్ర‌మే విడుద‌లైంది.

శ‌ర్వానంద్‌, సాయి ప‌ల్ల‌వి.. 'విరాటపర్వం 1992?

శ‌ర్వానంద్, సాయి ప‌ల్ల‌వి జంట‌గా హను రాఘ‌వ‌పూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ప‌డిప‌డి లేచె మ‌న‌సు'.