నాగచైతన్య - సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ నెం.2

  • IndiaGlitz, [Thursday,March 08 2018]

షైన్ స్క్రీన్స్ తమ సంస్థ నుంచి రాబోయే రెండో చిత్రాన్ని ఎనౌన్స్ చేసింది. యువ సామ్రాట్ నాగచైతన్య, సమంత జంటగా.. 'నిన్ను కోరి' లాంటి ఫీల్ గుడ్ ఫిలిమ్ తో డైరెక్టర్ గా పరిచయమైన శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. "ఏమాయ చేసావే, మనం" లాంటి సూపర్ హిట్ చిత్రాల అనంతరం చైతూ-సామ్ కలిసి నటిస్తున్న చిత్రం కావడం, ముఖ్యంగా పెళ్ళైన తర్వాత ఈ జంట కలిసి వెండితెరపై కనిపించనుండడం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు సాహు గారపాటి-హరీష్ పెద్ది మాట్లాడుతూ.. "నాగచైతన్య-సమంత జంటగా "నిన్ను కోరి" ఫేం శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం త్వరలో సెట్స్ కి వెళ్లనుంది. మా సంస్థ నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న "కృష్ణార్జున యుద్ధం" ఏప్రిల్ లో విడుదలకు సిద్ధమవుతొంది. నాగచైతన్య-సమంతల కాంబినేషన్ చిత్రానికి సంబంధించిన పూర్తి సమాచారం, నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం" అన్నారు.

More News

ద్విభాషా చిత్రంలో నితిన్...

యూనివర్సల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ ఇప్పుడు రాజకీయాల్లో బిజీ కావడం వల్ల..

నితిన్ తో ఛలో అంటున్న దర్శకుడు...

ఈ ఏడాది 'ఛలో' సినిమాతో సక్సెస్ అందుకున్న దర్శకుడు వెంకీ కుడుముల.

మార్చి 9న 'కోటికొక్కడు'

'ఈగ' ఫేమ్‌ సుదీప్‌ హీరోగా నిత్యమీనన్‌ హీరోయిన్‌గా కె.ఎస్‌. రవికుమార్‌ దర్శకత్వంలో కన్నడ, తమిళ్‌ భాషల్లో రూపొందిన చిత్రం 'కోటిగొబ్బ-2'. ఈ చిత్రం ఇటీవల రిలీజై సెన్సేషనల్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయి 120 కోట్లకు పైగా కలెక్ట్‌ చేసింది.

19 గంటల్లోనే10 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన 'ది విజన్ ఆఫ్ భరత్'

సూపర్ స్టార్ మహేష్ బాబు,సూపర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో

సంజ‌య్ ద‌త్‌ను షాక్‌కు గురి చేసిన అభిమాని...

బాలీవుడ్ స్టార్ సంజ‌య్ ద‌త్‌ను ఓ అభిమాని చ‌ర్య షాక్‌కి గురి చేసింది. చివ‌ర‌కు ఆ అభిమాని చ‌నిపోయి ఉండ‌టం గ‌మ‌నార్హం. వివ‌రాల్లోకెళ్తే.. ముంబైకి చెందిన నిషా త్రిపాఠి అనే మ‌హిళ త‌న ఆస్థినంత‌టినీ సంజ‌య్ ద‌త్ పేరిట రాసి చ‌నిపోయింది.