అక్కినేని నాగచైతన్య , శ్రుతిహాసన్ ల తొలి కాంబినేషన్..ఫిక్స్

  • IndiaGlitz, [Wednesday,November 18 2015]

అక్కినేని నాగ చైత‌న్య‌, శ్రుతి హాస‌న్ ల తొలి కాంబినేష‌న్లో 'కార్తికేయ' వంటి ఘన విజయం అందించిన 'చందు మొండేటి..ద‌ర్శ‌క‌త్వంలో

మళయాళ సీమలో పెద్ద విజయం సాధించిన 'ప్రేమంస రీమేక్ చేస్తున్నారు. ఇలాంటి గొప్ప కలయికలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ . ఈ చిత్రానికి సంభందించిన అధికారిక ప్రకటన విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ..'అక్కినేని నాగచైతన్య, శ్రుతిహాసన్, చందు మొండేటి ల కాంబినేషన్ లో మలయాళం' లో ఘన విజయం సాధించిన 'ప్ర్తేమం' చిత్రాన్ని తెలుగు లో పునర్నిర్మించటం ఆనందంగా ఉంది. 'సితార ఎంటర్ టైన్ మెంట్స్' పతాకం పై నిర్మిస్తున్న తొలి చిత్రమిది. ఈ నెలలోనే చిత్రం పూజా కార్యక్రమాలు జరుగుతాయి. డిసెంబర్ నెలలో చిత్రం రెగ్యులర్ షూటింగ్ విశాఖలో ప్రారంభమవుతుంది. సమ్మర్ స్పెషల్ గా చిత్రం విడుదల అయ్యే దిశగా నిర్మాణ కార్యక్రమాలకు రూపకల్పన జరుగుతోందని ఆయన తెలిపారు.

'ప్రేమం' ఓ స్వచ్చ మైన ప్రేమకధ. 'ప్రేమ తో కూడిన సంగీత భరిత వినోద దృశ్య కావ్యం ఈ చిత్రం.అక్కినేని నాగచైతన్య సరసన శ్రుతిహాసన్ తో పాటు మరో ఇద్దరు కధానాయికలు కూడా నటిస్తున్నారు. వారిలో ఒకరు 'అనుపమ పరమేశ్వరన్' కాగా మరో కధానాయిక ఎంపిక కావలసి ఉంది. మాతృకను మించి తెలుగు లో ఈ చిత్రం మంచి విజయం సాధించేలా దర్శకుడు 'చందు మొండేటి' రూప కల్పన చేస్తున్నారు అని ఆయన తెలిపారు.

దర్శకుడు 'చందు మొండేటి' మాట్లాడుతూ..'అక్కినేని నాగచైతన్య హీరోగా, సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని రూపొందించటం ఎంతో ఆనందంగా ఉంది. 'ప్రేమం' చిత్రాన్ని తెలుగులో రూపొందించటం అన్నది భాద్యత తో కూడినది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మా టీం ఈ చిత్రం రూపకల్పన కు కృషి చేస్తోంది అని తెలిపారు దర్శకుడు.

ఈ చిత్రానికి సంగీతం; రాజేష్ మురుగేషన్, గోపిసుందర్; చాయా గ్రహణం: కార్తీక్ ఘట్టమనేని: ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు; ఆర్ట్: సాహి సురేష్; ఒరిజినల్ స్టోరి: ఆల్ఫోన్సె పుధరిన్; సమర్పణ: పి.డి.వి. ప్రసాద్ నిర్మాత: సూర్యదేవర నాగవంశి స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం: చందు మొండేటి

More News

'కుమారి 21 ఎఫ్' ప్లాటినమ్ డిస్క్..

హేబా పటేల్,రాజ్ తరుణ్ జంటగా సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో సుకుమార్ సమర్పణలో విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి,థామస్ రెడ్డి ఆదూరి నిర్మిస్తున్న చిత్రం 'కుమారి 21ఎఫ్'.

2015 తెలుగు సినిమా ప్రత్యేకత ఇదే...

ఫలితాలు,నిడివి..ఇలాంటి విషయాలను పక్కన పెడితే..2015 తెలుగు సినిమా చాలా ప్రత్యేకం.ఎందుకంటే..రెండు తరాల అగ్ర కథానాయకులు వెండితెరపై సందడి చేశారు కాబట్టి.

సూర్య '24' స్పెషాలిటీ...

'మనం'దర్శకుడు విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో సూర్య నటిస్తున్న చిత్రం '24'.నిత్యా మీనన్,సమంత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా 2016 సమ్మర్ లో రిలీజ్ కానుంది.

నానికిదే ఫస్ట్ టైమ్

ఏడేళ్లకు పైగా కథానాయకుడిగా అలరిస్తున్నాడు యువ కథానాయకుడు నాని.'అష్టా చెమ్మా'నుంచి 'భలేభలే మగాడివోయ్'' వరకు ఈజ్ తో కూడిన యాక్టింగ్ తో తనకంటూ ప్రేక్షక వర్గాన్ని సొంతం చేసుకున్నాడీ టాలెంటెడ్ హీరో.

డిక్టేటర్ సాంగ్ పై శ్రీవాస్ కామెంట్..

నందమూరి నట సింహాం బాలక్రిష్ణ నటిస్తున్న తాజా చిత్రం డిక్టేటర్.ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ శ్రీవాస్ తో కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం.