నిర్మాత‌గా మారుతున్న చైత‌న్య‌

  • IndiaGlitz, [Tuesday,February 25 2020]

అక్కినేని వార‌సుల్లో మూడో త‌రం హీరోలుగా అక్కినేని చైత‌న్య‌, అఖిల్ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితులే. ఇందులో అఖిల్ నాలుగో సినిమానే చేస్తుండ‌గా చైత‌న్య హీరోగా స‌క్సెస్‌లు సాధించాడు. హీరోయిన్ స‌మంత‌ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ అక్కినేని హీరోలంటే ట‌క్కున గుర్తుకొచ్చే పేరు అన్న‌పూర్ణ స్టూడియోస్‌. తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ మ‌ద్రాసు నుండి హైద‌రాబాద్ రావ‌డానికి కార‌ణ‌మైన అక్కినేని నాగేశ్వ‌ర‌రావు నిర్మించిన ఈ స్టూడియో వ్య‌వ‌హారాల‌ను ఇప్పుడు అక్కినేని నాగార్జున ఇత‌ర కుటుంబ స‌భ్యులు ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఇది కాకుండా నాగార్జున, అత‌ని కొడుకులు మాత్ర‌మే క‌లిసి మ‌నం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అనే బ్యాన‌ర్‌ను కూడా పెట్టుకున్నారు.

అయితే ఇప్పుడు చైత‌న్య రూట్ మారుస్తున్నాడ‌ట‌. త‌ను ఓ సొంత నిర్మాణ సంస్థ‌ను పెట్టుకోవాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. కొత్త టాలెంట్‌ను, కొత్త కాన్సెప్ట్ చిత్రాల‌ను నిర్మించాల‌ని చైత‌న్య ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. ఇప్ప‌టికే కొత్త క‌థ‌ల‌ను వింటున్నాడ‌ట‌. సినీ వ‌ర్గాల్లో విన‌ప‌డుతున్న స‌మాచారం మేర‌కు చైత‌న్య ఓ డెబ్యూ డైరెక్ట‌ర్‌తో సినిమాను నిర్మించ‌బోతున్నాడ‌ట‌. హీరో ఎవ‌రో తెలుసా.. రాజ్‌త‌రుణ్‌. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబందించిన వివ‌రాలు తెలుస్తాయంటున్నారు. మ‌రో ప‌క్క చైత‌న్య.. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో 'ల‌వ్‌స్టోరి' సినిమా చేస్తున్నాడు.

More News

భారత్ పర్యటన ఎప్పటికీ మర్చిపోలేను: ట్రంప్

అగ్రరాజ్యం అధినేత డోనాల్డ్ ట్రంప్ రెండ్రోజుల పర్యటన అనంతరం మీడియా మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై సీనియర్ నటి ఫైర్!

దేశ రాజధానిలో మళ్లీ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. సీఏఏ వ్యతిరేక నిరసనలతో ఢిల్లీలో హింసాత్మకంగా మారింది.

టెక్సాస్‌లో ఘోర ప్రమాదం.. ముగ్గురు హైదరాబాదీలు దుర్మరణం

అమెరికాలోని టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు భారతీయులు అక్కడికక్కడే మృతిచెందారు.

'భీష్మ'ను ఆద్యంతం ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు.. అందుకే ఇంత పెద్ద హిట్టయ్యింది - దిల్ రాజు

ప్రముఖ హీరో నితిన్ టైటిల్ రోల్ పోషించిన 'భీష్మ' మూవీ ఫిబ్రవరి 21న విడుదలై ఘన విజయం సాధించింది.

న‌న్ను కించ‌ప‌ర‌డానికే..!:  మెహ్రీన్‌

అశ్వ‌థ్థామ సినిమా ప్ర‌మోష‌న్స్ స‌మ‌యంలో హీరోయిన్ మెహ్రీన్‌, నిర్మాత‌ల‌కు మ‌నస్ప‌ర్ధ‌లు వ‌చ్చాయని, అందుక‌నే నిర్మాలు మెహ్రీన్ క‌ట్టాల్సిన బిల్లులు క‌ట్ట‌లేదంటూ సోష‌ల్ మీడియాలో వార్త‌లు వచ్చాయి.