నిర్మాత‌గా మారుతున్న అక్కినేని హీరో!!

  • IndiaGlitz, [Tuesday,May 05 2020]

తెలుగు సినీ ఇండస్ట్రీలో అన్నపూర్ణ స్టూడియో గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. ఎందుకనో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రముఖ నిర్మాణ సంస్థలో ఒకటిగా నిలిచిన అన్నపూర్ణ స్టూడియోస్ వ్యవహారాలను అక్కినేని కుటుంబ సభ్యులు నిర్వహిస్తుంటారు. ఇప్పుడు ఓ అక్కినేని హీరో స్వంత నిర్మాణ సంస్థ‌ను స్టార్ట్ చేయ‌బోతున్నాడు. ఆ హీరో ఎవ‌రో కాదు అక్కినేని నాగ‌చైత‌న్య‌. చాలా రోజుల నుండి చైత‌న్య ఓ నిర్మాణ సంస్థ‌ను స్టార్ట్ చేసి కొత్త కాన్సెప్ట్ చిత్రాలను ఎంక‌రేజ్ చేస్తార‌నే వార్త‌లు విన‌ప‌డుతూనే ఉన్నాయి. అందులో భాగంగా తొలి చిత్రంగా రాజ్ త‌రుణ్ హీరోగా చైత‌న్య ఓ సినిమాను నిర్మించ‌బోతున్నాడు. ఈ సినిమాను శ్రీనివాస్ గ‌విరెడ్డి డైరెక్ట్ చేయ‌బోత‌న్నాడు. ఇందులో హీరోయిన్‌గా అవికాగోర్ న‌టించ‌నుంది.

రాజ్‌త‌రుణ్‌, అవికాగోర్ గ‌తంలో ఉయ్యాలా జంపాలా చిత్రంతో హీరో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయ్యారు. సినిమా భారీ విజ‌యాన్ని సాధించింది. త‌ర్వాత సినిమా చూపిస్త‌మావ చిత్రంలోనూ జోడీ క‌ట్టారు. ఈ సినిమా కూడా మంచి హిట్ అయ్యింది. అయితే త‌ర్వాత ఈ జోడీ మ‌రో సినిమాలో క‌లిసి న‌టించ‌లేదు. మ‌ధ్య అవికాగోర్ సినిమా రంగానికి దూర‌మైంది. గ‌త ఏడాది ఈ అమ్మ‌డు రాజుగారిగ‌ది 3 చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది. చాలా గ్యాప్ త‌ర్వాత ఈ జోడీ మ‌ళ్లీ వెండితెర‌పై సంద‌డి చేయ‌నుంది. వివరాల్లోప్ర‌స్తుతం క‌రోనా ప్ర‌భావం కొన‌సాగుతుంది. ఈ క‌రోనా ఎఫెక్ట్ త‌గ్గిన త‌ర్వాత ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించనుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతుత‌న్నాయి.

More News

శ్రీముఖికి అనుకోని షాక్‌...పోలీస్ కేసు

ప్ర‌ముఖ యాంక‌ర్ శ్రీముఖికి అనుకోని షాక్ త‌గిలింది. న‌ల్ల‌కుంట్ల‌కు చెందిన వెంక‌ట‌ర‌మ‌ణ శ‌ర్మ అనే వ్య‌క్తి శ్రీముఖిపై ఫిర్యాదు చేశారు. ఇంత‌కు ఆమెపై ఫిర్యాదు ఎందుకు చేశారు?

కేజ్రీవాల్.. వైఎస్ జగన్ నోట ఒకే మాట..!

‘కరోనా మహమ్మారిని ఇప్పటికిప్పుడు నిర్మూలించే పరిస్థితి లేదు. కాబట్టి దాంతో కలిసే సహజీవనం చేయాల్సిన పరిస్థితి వస్తుంది.

ఎన్టీఆర్-బన్సాలి చిత్రం తాజా అప్డేట్‌ ఇదీ..!

బాలీవుడ్ ద‌ర్శక నిర్మాత సంజ‌య్ లీలా బ‌న్సాలీ భారీ బడ్జెట్‌తో యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ను హీరోగా పెట్టి సినిమా తీస్తారని వార్తలు వస్తున్నాయి. గత నాలుగైదు రోజులుగా సోషల్ మీడియాలో..

సాధినేని యామినికి అమెరికాలో అరుదైన గౌరవం

ఫైర్‌బ్రాండ్‌గా పేరుగాంచిన బీజేపీ నాయకురాలు సాధినేని యామిని శర్మకు అమెరికాలో అరుదైన గౌరవం లభించింది. అమెరికాలోని భారతీయ యువ పారిశ్రామికవేత్తల

దాస‌రి గురించి చిరు, మోహ‌న్‌బాబు ఏమ‌న్నారంటే..?

ఈరోజు ద‌ర్శ‌క‌ర‌త్న డా.దాస‌రి నారాయ‌ణ‌రావు 73వ జ‌యంతి. ఈ రోజు తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మంతా క‌లిసి డైరెక్ట‌ర్స్ డే కూడా ప్ర‌క‌టించుకున్నారు. ఈరోజు ఉద‌యం ఫిలించాంబ‌ర్‌లో ఆయ‌న విగ్ర‌హానికి పూల‌మాల