ఛాలెంజింగ్ పాత్ర‌లో నాగ‌శౌర్య‌!

  • IndiaGlitz, [Saturday,December 19 2020]

యువ క‌థానాయ‌కుడు నాగశౌర్య చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఒక వైపు ల‌క్ష్య‌, వ‌రుడు కావాలెను చిత్రాలతో పాటు తన బ్యానర్లో అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓసినిమా చేస్తున్నాడు. ఇది కాకుండా శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ నిర్మాత‌గా ఆయ‌న బ్యాన‌ర్‌లో ఓ సినిమా చేయ‌డానికి శౌర్య ఓకే చెప్పాడ‌ట‌. ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర ఉంద‌ని, ఆ పాత్ర‌లో నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తాడ‌ని వార్త‌లు వినిపించాయి. కాగా.. ఈ సినిమాకు సంబంధించి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన అప్‌డేట్ కూడా సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. అదేంటంటే.. ఈ చిత్రంలో నాగ‌శౌర్య మాట‌లు మాట్లాడ‌లేని, చెవులు వినిపించ‌ని యువ‌కుడి పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ట‌. ఈ చిత్రాన్ని శ్రీరామ్ వేముల అనే ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించ‌నున్నాడ‌ని టాక్‌.

గ‌త ఏడాది నాగ‌శౌర్య‌కు పెద్ద‌గా క‌లిసి రాలేద‌నే చెప్పాలి. ఎందుకంటే అటు న‌టుడిగా, ఇటు నిర్మాత‌గా నాగ‌శౌర్య‌కు హిట్ లేదు. స‌మంత టైటిల్ పాత్ర‌లో న‌టించిన 'ఓబేబీ' చిత్రంలో నాగ‌శౌర్య ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు. ఈ సినిమా ఫలితం శౌర్య‌కు కాస్త ఊర‌ట‌నిచ్చింది. ఇక 2020లో ఏ సినిమా విడుద‌ల‌య్యే అవ‌కాశం లేదు. దీంతో నాగ‌శౌర్య ఆశ‌ల‌న్నీ 2021పైనే ఉన్నాయి. చేస్తున్న నాలుగు చిత్రాల్లో ఏ సినిమా ఎలాంటి స‌క్సెస్‌ను అందిస్తుంద‌నేది తెలియాలంటే వెయిటింగ్ త‌ప్ప‌దు.

More News

‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఓ ఆసక్తికర అప్‌డేట్...

దర్శకధీరుడు రాజమౌళి ఏం చేసినా చాలా ప్రత్యేకంగా ఉంటుంది.

ఇంకెన్ని రోజులు రైతులకు ఈ పరిస్థితి..: సోనూసూద్

రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై పంజాబ్‌ రైతులు ప్రాణాలను సైతం లెక్కచేయక ఆందోళన నిర్వహిస్తున్నారు.

'హ‌ర్లా ఫర్లా' సాంగ్‌తో ఆక‌ట్టుకుంటోన్న విశాల్ 'చ‌క్ర'

యాక్ష‌న్ హీరో విశాల్ హీరోగా ఎంఎస్‌ ఆనందన్‌ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం `చ‌క్ర‌`.  శ్రద్దా శ్రీనాథ్  హీరోయిన్‌గా న‌టిస్తున్న

ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి సాయమందిస్తూ.. ఐదుగురి దుర్మరణం

ముక్కూ మొహం తెలియకున్నా.. తోటి మనిషి ప్రమాదంలో గాయపడ్డాడని వారి హృదయం తల్లడిల్లిపోయింది.

తెలంగాణలో రాజా సాబ్ కొడుకో.. నిజాం చెంచానో సీఎం కాడు: తరుణ్ ఛుగ్

తెలంగాణ రాష్ట్రానికి 2023లో సామాన్యుడే సీఎం అవుతారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ ఛుగ్‌ ప్రకటించారు.