close
Choose your channels

డబుల్ బొనాంజా ఇవ్వబోతున్న నాగశౌర్య

Friday, November 17, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

'జ్యో అచ్యుతానంద' త‌రువాత ఏడాది గ్యాప్‌తో యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య సంద‌డి చేసిన చిత్రం 'కథలో రాజకుమారి'. నారా రోహిత్ హీరోగా న‌టించిన ఈ సినిమాలో నాగ‌శౌర్య గెస్ట్ రోల్ చేశాడు. ప్ర‌స్తుతం ఈ యంగ్ హీరో చేతినిండా సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. వాటిలో.. తన హోం ప్రొడక్షన్ లో చేస్తున్న‌ 'ఛలో' ఒక‌టి.

తన హోం ప్రొడక్షన్ లో నిర్మించబోతున్న మొదటి సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఈ మూవీ లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే.. ఈ సినిమాతో పాటు 'కణం' అనే సినిమాను కూడా చేస్తున్నాడు నాగ‌శౌర్య‌. ఈ మూవీని 'కరు' అనే పేరుతో తమిళంలో కూడా రిలీజ్ చేస్తున్నారు. నాగ‌శౌర్య కెరీర్లో ఇదే తొలి ద్విభాషా చిత్రం కావ‌డం విశేషం

ఇందులో సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇదిలా ఉంటే.. యాదృచ్ఛికంగా జరిగిందో, లేదా కావాలని చేశారో తెలియదు కాని.. 'ఛలో' టీజర్, అలాగే 'కణం' ట్రైలర్ నవంబర్ 18 విడుద‌ల కానున్నాయి. అంటే.. నాగ‌శౌర్య ఒకే రోజు డ‌బుల్ బొనాంజా ఇవ్వ‌నున్నాడ‌న్న‌మాట‌.

ఇండియ‌న్‌ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా 'కణం' ట్రైలర్ ని రిలీజ్ చేయనున్నారు. 'కణం' సినిమా ఎప్పుడు రిలీజ్ అన్నది త్వరలోనే వెల్లడిస్తారు. ఇక‌ ఛలో` విషయానికి వ‌స్తే.. డిసెంబర్ 29న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.